Telugu Global
Cinema & Entertainment

ఒకే వేదిక పైకి చిరు, ఎన్టీఆర్

సరిలేరు నీకెవ్వరు ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు తెరవెనక ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఇప్పటికే వేదికను ఖరారు చేశారు. డేట్ కూడా ఫిక్స్ చేశారు. ఇప్పుడు ప్రత్యేక అతిథులుగా వచ్చే స్టార్స్ పై ఫోకస్ పెట్టారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే మహేష్ నటించిన ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు చిరంజీవి, ఎన్టీఆర్ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యే అవకాశం ఉంది. మహేష్ ఫంక్షన్ కు ఎన్టీఆర్ రావడం కొత్తేంకాదు. గతంలో భరత్ అనే నేను సినిమా ఫంక్షన్ కు […]

ఒకే వేదిక పైకి చిరు, ఎన్టీఆర్
X

సరిలేరు నీకెవ్వరు ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు తెరవెనక ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఇప్పటికే వేదికను ఖరారు చేశారు. డేట్ కూడా ఫిక్స్ చేశారు. ఇప్పుడు ప్రత్యేక అతిథులుగా వచ్చే స్టార్స్ పై ఫోకస్ పెట్టారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే మహేష్ నటించిన ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు చిరంజీవి, ఎన్టీఆర్ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యే అవకాశం ఉంది.

మహేష్ ఫంక్షన్ కు ఎన్టీఆర్ రావడం కొత్తేంకాదు. గతంలో భరత్ అనే నేను సినిమా ఫంక్షన్ కు వెళ్లాడు. ఈసారి సరిలేరు నీకెవ్వరు ఫంక్షన్ కు వెళ్లబోతున్నాడు. అయితే మహేష్-చిరంజీవి కలిసి మాత్రం చాన్నాళ్లయింది. ఆ ముచ్చట ఈ వేడుకతో తీరబోతోంది. ప్రస్తుతానికైతే చిరంజీవి ఓకే చెప్పేశారు. ఎన్టీఆర్ నుంచి మాత్రం ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు. దీనికి ఓ కారణం ఉంది.

సరిలేరు నీకెవ్వరు సినిమాకు పోటీగా అల వైకుంఠపురములో సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీకి కూడా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ప్లాన్ చేశారు. వాళ్లు కూడా ఎన్టీఆర్ ను రప్పించే ప్రయత్నాల్లో ఉన్నారు. సో.. ఈ రెండు ఫంక్షన్లలో దేనికి వెళ్లాలనేది ఎన్టీఆర్ ఇంకా నిర్ణయించుకోలేదట. మ్యాగ్జిమమ్ మహేష్ బాబు ఫంక్షన్ కే ఎన్టీఆర్ వచ్చే ఛాన్స్ ఉంది.

First Published:  20 Dec 2019 7:02 PM GMT
Next Story