Telugu Global
NEWS

ఇవ్వాల్సింది బంగారు గాజులు కాదు... హెరిటేజ్ భూములు " భువనేశ్వరికి డిప్యూటీ సీఎం కౌంటర్

చంద్రబాబు ఓ ఎత్తు వేస్తే అధికార వైసీపీ నేతలు అంతకుమించిన ఎత్తులు వేస్తున్నారు. తన భార్యతో సెంటిమెంట్ పండించిన చంద్రబాబుకు తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి అదిరిపోయే కౌంటర్లతో బెంబేలెత్తించారు. తాజాగా తన భార్యతో కలిసి అమరావతిలో పర్యటించారు చంద్రబాబు. ఈ క్రమంలోనే భావోద్వేగానికి గురైన చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తన చేతులకు ఉన్న బంగారు గాజులను ఆ మహిళా రైతులకు ఇచ్చారు. అయితే తాజాగా దీనిపై కౌంటర్ ఇచ్చిన ఏపీ డిప్యూటీ […]

ఇవ్వాల్సింది బంగారు గాజులు కాదు... హెరిటేజ్ భూములు  భువనేశ్వరికి డిప్యూటీ సీఎం కౌంటర్
X

చంద్రబాబు ఓ ఎత్తు వేస్తే అధికార వైసీపీ నేతలు అంతకుమించిన ఎత్తులు వేస్తున్నారు. తన భార్యతో సెంటిమెంట్ పండించిన చంద్రబాబుకు తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి అదిరిపోయే కౌంటర్లతో బెంబేలెత్తించారు.

తాజాగా తన భార్యతో కలిసి అమరావతిలో పర్యటించారు చంద్రబాబు. ఈ క్రమంలోనే భావోద్వేగానికి గురైన చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తన చేతులకు ఉన్న బంగారు గాజులను ఆ మహిళా రైతులకు ఇచ్చారు.

అయితే తాజాగా దీనిపై కౌంటర్ ఇచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం పుష్ఫ శ్రీవాణి.. చంద్రబాబుకు, ఆయన భార్య భువనేశ్వరికి ఓ సంచలన సవాల్ విసిరారు. అసలు రాజధాని రైతులకు భువనేశ్వరి పంచాల్సింది బంగారు గాజులు కాదని.. చంద్రబాబు హయాంలో అన్యాయంగా తీసుకున్న రైతుల భూములని.. దమ్ముంటే వాటిని ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇన్ సైడర్ ట్రేడింగ్ పేరుతో టీడీపీ నేతలు 4వేల ఎకరాలకు పైగా దోచుకుంది నిజం కాదా అని ప్రశ్నించారు. హెరిటేజ్ పేరుతో రాజధానిలో 14.22 ఎకరాల భూములను కొన్న భువనేశ్వరి వెంటనే వాటిని రైతులకు ఇచ్చేయాలని కోరారు.
ఇవ్వాల్సింది బంగారు గాజులు కాదని.. భూములు అంటూ పుష్ప శ్రీవాణి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

First Published:  1 Jan 2020 11:54 PM GMT
Next Story