Telugu Global
National

రాజధానిలో కృత్రిమ ఆత్మహత్యలకు ప్లాన్ చేస్తున్నారు... ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి " బీజేపీ నేత చిట్టిబాబు

ప్రాణం పోయినా తమ భూములు ఇవ్వబోమని చెప్పే రైతులను ఇంతకాలం చూశామని… మా భూములు వద్దు… అందుకు ప్రాణమైనా ఇస్తామంటున్న రైతులు రాజధానిలో మాత్రమే కనిపిస్తున్నారని బీజేపీ నేత చిట్టిబాబు వ్యాఖ్యానించారు. ఇది రియల్ ఎస్టేట్‌ పోకడ అన్నది స్పష్టంగా అర్థమవుతోందన్నారు. ఒక చర్చా కార్యక్రమంలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ బాధ తన బాధ అని శ్రీశ్రీ చెబితే… తన బాధ ప్రపంచ బాధ అని కృష్ణశాస్త్రి చెప్పారని… ఇప్పుడు చంద్రబాబు కూడా […]

రాజధానిలో కృత్రిమ ఆత్మహత్యలకు ప్లాన్ చేస్తున్నారు... ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి  బీజేపీ నేత చిట్టిబాబు
X

ప్రాణం పోయినా తమ భూములు ఇవ్వబోమని చెప్పే రైతులను ఇంతకాలం చూశామని… మా భూములు వద్దు… అందుకు ప్రాణమైనా ఇస్తామంటున్న రైతులు రాజధానిలో మాత్రమే కనిపిస్తున్నారని బీజేపీ నేత చిట్టిబాబు వ్యాఖ్యానించారు. ఇది రియల్ ఎస్టేట్‌ పోకడ అన్నది స్పష్టంగా అర్థమవుతోందన్నారు. ఒక చర్చా కార్యక్రమంలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రపంచ బాధ తన బాధ అని శ్రీశ్రీ చెబితే… తన బాధ ప్రపంచ బాధ అని కృష్ణశాస్త్రి చెప్పారని… ఇప్పుడు చంద్రబాబు కూడా తన బాధ ప్రపంచ బాధ అన్నట్టుగా కృష్ణశాస్త్రిలా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.

రాజధాని ప్రాంతంలో మరో దుర్మార్గమైన ఆలోచన కూడా చేస్తున్నారని చిట్టిబాబు వివరించారు. కొందరు ఆత్మహత్యలు చేసుకునేలా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారని వెల్లడించారు. ఈమేరకు తమకు సమాచారం అందుతోందన్నారు.

పెద్దలే కొందరిని ఎంపిక చేసి వారిలో నలుగురైదుగురు ఆత్మహత్యలు చేసుకునేలా ప్లాన్ చేస్తున్నారని వివరించారు. ఆ ఆత్మహత్యలను బాగా ప్రచారం చేసి లబ్ది పొందే దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారని… ఈ విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

టీడీపీ నేతలు హత్యలు చేసి ఆత్మహత్యలుగా చూపించగల సమర్ధులు అంటూ అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను కూడా చర్చలో పాల్గొన్న వారు గుర్తు చేశారు.

First Published:  2 Jan 2020 11:11 PM GMT
Next Story