Telugu Global
NEWS

జగన్‌ నీ రేటు చెప్పు... కొనుక్కుంటాం " రాజధాని మహిళలు

ఇలా అన్న మహిళల పేర్లు అయితే ప్రత్యేకంగా రాయలేదు గానీ… టీడీపీ పత్రిక మాత్రం రాజధాని మహిళల పేరుతో ఒక కథనాన్ని రాసింది. ధర్నాల్లో కూర్చుంటున్న వారంతా ఫెయిడ్ ఆర్టిస్టులని, వైసీపీ కార్యకర్తలు ఎవరైనా ధర్నాలో కూర్చునేందుకు సిద్ధమైతే వారికి వెయ్యి రూపాయలు ఇస్తున్నారంటూ… కొందరు వైసీపీ నేతలు చేసిన ఆరోపణలపై రాజధాని మహిళలు ఏమంటున్నారు? అన్న దానిపై ఆ పత్రిక ఈ కథనం రాసింది. తాము ఫెయిడ్ ఆర్టిస్టులమైతే ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి కూడా వచ్చి […]

జగన్‌ నీ రేటు చెప్పు... కొనుక్కుంటాం  రాజధాని మహిళలు
X

ఇలా అన్న మహిళల పేర్లు అయితే ప్రత్యేకంగా రాయలేదు గానీ… టీడీపీ పత్రిక మాత్రం రాజధాని మహిళల పేరుతో ఒక కథనాన్ని రాసింది. ధర్నాల్లో కూర్చుంటున్న వారంతా ఫెయిడ్ ఆర్టిస్టులని, వైసీపీ కార్యకర్తలు ఎవరైనా ధర్నాలో కూర్చునేందుకు సిద్ధమైతే వారికి వెయ్యి రూపాయలు ఇస్తున్నారంటూ… కొందరు వైసీపీ నేతలు చేసిన ఆరోపణలపై రాజధాని మహిళలు ఏమంటున్నారు? అన్న దానిపై ఆ పత్రిక ఈ కథనం రాసింది.

తాము ఫెయిడ్ ఆర్టిస్టులమైతే ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి కూడా వచ్చి తమతో పాటు ధర్నాలో కూర్చోవాలని ఒక మహిళ డిమాండ్ చేసినట్టు పత్రిక రాసింది. ఆ పత్రికలో వచ్చిన దాని ప్రకారం ఒక రాజధాని మహిళ ఇలా అన్నదట. ” మేం ఫెయిడ్ ఆర్టిస్టులమా?. వైసీపీ కార్యకర్తలు వచ్చి సంఘీభావం తెలిపితే వాళ్లకు వెయ్యి రూపాయలు ఇచ్చారని అంటున్నారు.

వైసీపీ కార్యకర్త వెయ్యికి అమ్ముడుపోతే… జగన్‌మోహన్ రెడ్డి గారు మీకొక రేటు ఉంటుంది కదా? ఆ రేటేదో చెప్పండి. మా ఆస్తులు అమ్ముతాం, మా తాళిబొట్టు అమ్ముతాం.. మిమ్మల్ని కొంటాం. మా అమరావతిని ఇక్కడే పెట్టుకుంటాం” అని సదరు మహిళ ప్రకటించినట్టు పత్రిక వెల్లడించింది.

ఈ కథనంపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. అమరావతిలో భూములున్న వారు ముఖ్యమంత్రినే కొనేంత ధనవంతులన్న మాట అని కొందరు… చాలా కాలం తర్వాత శుభలగ్నం సినిమాను గుర్తు చేస్తున్నారని మరికొందరు సెటైర్లు వేస్తున్నారు.

First Published:  8 Jan 2020 12:26 AM GMT
Next Story