Telugu Global
NEWS

జగన్‌కు తమిళనాడు అసెంబ్లీ ధన్యవాదాలు

తమిళనాడులోనూ ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డికి యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. అక్కడి యూత్ జగన్‌ను ఆంధ్రా బాహుబలి అంటూ అభివర్ణిస్తుంటారు. తమిళనాడు అసెంబ్లీ కూడా జగన్‌మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపింది. ఇటీవల కనివిని ఎరుగని స్థాయిలో చెన్నైలో నీటి కొరత ఏర్పడినప్పుడు… ఏపీ ముఖ్యమంత్రి తక్షణం స్పందించి ఏపీ నుంచి నీటిని విడుదల చేయడంపై తమిళనాడు అసెంబ్లీ ధన్యవాదాలు తెలిపింది. చెన్నై నీటి ఎద్దడి నేపథ్యంలో తమిళనాడు మంత్రుల బృందం స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ […]

జగన్‌కు తమిళనాడు అసెంబ్లీ ధన్యవాదాలు
X

తమిళనాడులోనూ ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డికి యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. అక్కడి యూత్ జగన్‌ను ఆంధ్రా బాహుబలి అంటూ అభివర్ణిస్తుంటారు. తమిళనాడు అసెంబ్లీ కూడా జగన్‌మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపింది. ఇటీవల కనివిని ఎరుగని స్థాయిలో చెన్నైలో నీటి కొరత ఏర్పడినప్పుడు… ఏపీ ముఖ్యమంత్రి తక్షణం స్పందించి ఏపీ నుంచి నీటిని విడుదల చేయడంపై తమిళనాడు అసెంబ్లీ ధన్యవాదాలు తెలిపింది.

చెన్నై నీటి ఎద్దడి నేపథ్యంలో తమిళనాడు మంత్రుల బృందం స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిని కలిసిందని… ఏపీ నుంచి నీటిని విడుదల చేయాల్సిందిగా కోరిందని గుర్తు చేశారు. అందుకు తక్షణం స్పందించిన జగన్‌మోహన్ రెడ్డి నీటిని విడుదల చేయించడంతో గ్రేటర్ చెన్నై ప్రజలు నీటి కష్టాల నుంచి గట్టెక్కారని… ఇంతలోనే రుతుపవనాలు కూడా రావడంతో పరిస్థితి చక్కబడిందని పళనిస్వామి వివరించారు. చెన్నై ప్రజల కోసం సకాలంలో స్పందించిన ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు సీఎం పళనిస్వామి.

తమిళనాడు నీటి అవసరాలను మరింత మెరుగుపరిచేలా గోదావరి–కావేరీ నదుల అనుసంధానం పథకం అమలు కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులతో సమావేశాన్ని నిర్వహించి వీలైనంత త్వరగా వారి అంగీకారాన్ని పొందాలని కోరుతూ లేఖలు రాయడంతో పాటు… తాను స్వయంగా కలిసినపుడు ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశానని పళనిస్వామి అసెంబ్లీలో వివరించారు.

First Published:  9 Jan 2020 10:51 PM GMT
Next Story