Telugu Global
NEWS

దేశంలో ఉండడం వృథా.. మరో దేశానికి వెళ్లిపోతా- సుజనాచౌదరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరి అసహనంతో దేశాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో ఘోరాలు జరిగిపోతున్నాయంటూ వ్యాఖ్యానించారు. వాటిని అడ్డుకోకపోతే ఈ దేశంలో ఉండడం వృథా అని వ్యాఖ్యానించారు. ఈ ఘోరాలను అడ్డుకునేందుకు అందరూ కలిసి రావాలని కోరారు. లేదంటే ఈ దేశం వదిలేసి మరో దేశానికి వలస వెళ్లడం మంచిదని వ్యాఖ్యానించారు. ఒక ఎంపీగా ఉంటూ ఇలా దేశాన్ని విడిచి వెళ్లిపోవడం మంచిది అంటూ సుజనాచౌదరి వ్యాఖ్యానించడం దుమారం రేపుతోంది. పారిపోవాల్సి వస్తే బ్యాంకులకు 6వేల కోట్లు […]

దేశంలో ఉండడం వృథా.. మరో దేశానికి వెళ్లిపోతా- సుజనాచౌదరి
X

బీజేపీ ఎంపీ సుజనాచౌదరి అసహనంతో దేశాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో ఘోరాలు జరిగిపోతున్నాయంటూ వ్యాఖ్యానించారు. వాటిని అడ్డుకోకపోతే ఈ దేశంలో ఉండడం వృథా అని వ్యాఖ్యానించారు. ఈ ఘోరాలను అడ్డుకునేందుకు అందరూ కలిసి రావాలని కోరారు. లేదంటే ఈ దేశం వదిలేసి మరో దేశానికి వలస వెళ్లడం మంచిదని వ్యాఖ్యానించారు.

ఒక ఎంపీగా ఉంటూ ఇలా దేశాన్ని విడిచి వెళ్లిపోవడం మంచిది అంటూ సుజనాచౌదరి వ్యాఖ్యానించడం దుమారం రేపుతోంది. పారిపోవాల్సి వస్తే బ్యాంకులకు 6వేల కోట్లు ఎగ్గొట్టినందుకు పారిపోవాలి గానీ… అమరావతి విషయం అంత అవసరం ఏముందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎంపీగా ఉంటూ ఈ దేశంలో ఉండడం వృథా అన్నట్టుగా సుజనాచౌదరి వ్యాఖ్యానించడంపై బీజేపీ నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

First Published:  11 Jan 2020 12:16 AM GMT
Next Story