Telugu Global
NEWS

పది మంది కోసం పార్టీ పెడితే.. ఒక కులానికి పరిమితం చేసిన నీచుడు చంద్రబాబు

ఒకే చోట లక్షల కోట్ల ప్రజాధనం ఖర్చు పెట్టి,  అక్కడి వారి భూముల ధరలు పెరిగేలా చేసి నయా జమిందార్లను తయారు చేయడానికి తమ ప్రభుత్వం వ్యతిరేకమని మంత్రి కొడాలి నాని చెప్పారు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్నదే తమ ప్రభుత్వ ఆశయమని నాని చెప్పారు. కర్నూలులో హైకోర్టు పెడితే రెండు జిరాక్స్ సెంటర్లు మాత్రమే వస్తాయని పప్పుగాడు లోకేష్‌ అంటున్నాడని… మరి రెండు జిరాక్స్‌ సెంటర్లు వచ్చే హైకోర్టును కర్నూలుకు తీసుకెళ్తే ఎందుకు ఇంతగా […]

పది మంది కోసం పార్టీ పెడితే.. ఒక కులానికి పరిమితం చేసిన నీచుడు చంద్రబాబు
X

ఒకే చోట లక్షల కోట్ల ప్రజాధనం ఖర్చు పెట్టి, అక్కడి వారి భూముల ధరలు పెరిగేలా చేసి నయా జమిందార్లను తయారు చేయడానికి తమ ప్రభుత్వం వ్యతిరేకమని మంత్రి కొడాలి నాని చెప్పారు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్నదే తమ ప్రభుత్వ ఆశయమని నాని చెప్పారు. కర్నూలులో హైకోర్టు పెడితే రెండు జిరాక్స్ సెంటర్లు మాత్రమే వస్తాయని పప్పుగాడు లోకేష్‌ అంటున్నాడని… మరి రెండు జిరాక్స్‌ సెంటర్లు వచ్చే హైకోర్టును కర్నూలుకు తీసుకెళ్తే ఎందుకు ఇంతగా గింజుకుంటున్నారని ప్రశ్నించారు.

ముద్రగడ పద్మనాభం పాదయాత్రను అడ్డుకున్న సన్యాసి ఈ రాష్ట్రంలో చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం విశాఖలో మార్చ్ చేయడానికి వెళ్తే ఎయిర్‌పోర్టు రన్‌మీదే జగన్ ను అడ్డుకున్న సన్యాసి చంద్రబాబు కాదా అని నిలదీశారు. 14 ఏళ్లుగా సీఎంగా పనిచేసిన చంద్రబాబు ఇప్పుడు 23సీట్లకు పరిమితం అయ్యి.. ఇప్పుడు ఒక గల్లీ లీడర్‌లా పిచ్చి పనులు చేస్తున్నారన్నారు. సాయంత్రం ట్రాఫిక్ ఉన్న సమయంలో50 బస్సులు పెట్టుకుని యాత్ర చేయడం ఏమిటని ప్రశ్నించారు.

జేఏసీ పేరుతో రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలన్నది వీరి ఆలోచనగా కనిపిస్తోందన్నారు. జగన్‌ పాలనలో ఎలాంటి లోపాలు దొరకలేదు కాబట్టి… అల్లరి చేసి కాల్పులు జరిపించుకుని రాజకీయంగా తిరిగి బతకాలని చంద్రబాబు నాటకాలు మొదలుపెట్టారన్నారు. పీనుగులాంటి పార్టీకి జీవం పోసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ఎలాంటి వాడో గతంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావే చెప్పారన్నారు. రాజకీయాల కోసం పోలీసులతో ప్రజలను కొట్టించాలి… కాల్పులు జరిగేలా చేయాలి అన్నది చంద్రబాబు ఆలోచన అని కొడాలి విమర్శించారు.

రాజకీయం కోసం ఎంతటి లుచ్చాపనులైనా చేయడానికి వెనకాడని లుచ్చాగాడు చంద్రబాబు అని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పది మందికి ఉపయోగపడాలని ఎన్టీఆర్ పార్టీ పెడితే… దాన్ని ఇప్పుడు ఒక కులానికి పరిమితం చేసిన నీచుడు చంద్రబాబు అని కొడాలి నాని ఫైర్ అయ్యారు. రాజకీయం కోసం అమాయకుల ప్రాణాలు పణంగా పెట్టేందుకు కూడా చంద్రబాబు సిద్ధపడుతారని కాబట్టి జనం అప్రమత్తంగా ఉండాలని కోరారు.

ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను గాలికి వదిలేసి 29 గ్రామాల్లో పడి చస్తున్న చంద్రబాబును వదిలేసి వైసీపీ వైపు వస్తామని టీడీపీ ఎమ్మెల్యేలు అంటున్నారని కొడాలి నాని చెప్పారు. కాకపోతే వైసీపీలోకి రావాలంటే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని జగన్‌ మోహన్ రెడ్డి చెబుతుండడంతో వారి ప్రయత్నాలు ఆలస్యం అవుతున్నాయని వివరించారు.

First Published:  10 Jan 2020 11:27 PM GMT
Next Story