Telugu Global
NEWS

బుమ్రాకు బీసీసీఐ జంట అవార్డులు

శ్రీకాంత్, అంజుమ్ లకు సీకె నాయుడు పురస్కారం అత్యుత్తమ మహిళా క్రికెటర్ గా పూనమ్ యాదవ్ భారత యార్కర్ల కింగ్ జస్ ప్రీత్ బుమ్రా…2018-2019 సీజన్లో భారత అత్యుత్తమ అంతర్జాతీయ క్రికెటర్ గా జంట అవార్డులు అందుకొన్నాడు. బీసీసీఐ వార్షిక అవార్డుల కార్యక్రమంలో …పురుషుల విభాగంలో జస్ ప్రీత్ బుమ్రా, మహిళల విభాగంలో లెగ్ స్పిన్నర్ పూనమ్ యాదవ్ అవార్డులు అందుకొన్నారు. భారత తురుపుముక్క బుమ్రాకు పాలీ ఉమ్రిగర్, దిలీప్ సర్దేశాయి అవార్డులను ప్రదానం చేశారు. టెస్టు క్రికెట్లో […]

బుమ్రాకు బీసీసీఐ జంట అవార్డులు
X
  • శ్రీకాంత్, అంజుమ్ లకు సీకె నాయుడు పురస్కారం
  • అత్యుత్తమ మహిళా క్రికెటర్ గా పూనమ్ యాదవ్

భారత యార్కర్ల కింగ్ జస్ ప్రీత్ బుమ్రా…2018-2019 సీజన్లో భారత అత్యుత్తమ అంతర్జాతీయ క్రికెటర్ గా జంట అవార్డులు అందుకొన్నాడు.

బీసీసీఐ వార్షిక అవార్డుల కార్యక్రమంలో …పురుషుల విభాగంలో జస్ ప్రీత్ బుమ్రా, మహిళల విభాగంలో లెగ్ స్పిన్నర్ పూనమ్ యాదవ్ అవార్డులు అందుకొన్నారు.

భారత తురుపుముక్క బుమ్రాకు పాలీ ఉమ్రిగర్, దిలీప్ సర్దేశాయి అవార్డులను ప్రదానం చేశారు. టెస్టు క్రికెట్లో అత్యధికంగా 34 వికెట్లు పడగొట్టడంతో పాటు.. ఆస్ట్ర్రేలియాను ఆస్ట్ర్రేలియా గడ్డపై ఓడించడం ద్వారా తొలిసారిగా భారతజట్టు టెస్టు సిరీస్ సాధించడంలో బుమ్రా ప్రధానపాత్ర వహించాడు.

అంతేకాదు.. ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆస్ట్ర్రేలియా జట్లపై 5 వికెట్ల రికార్డును సైతం బుమ్రా నమోదు చేయగలిగాడు. బుమ్రాకు అవార్డుతో పాటు 15 లక్షల రూపాయల చెక్ ను సైతం అందచేశారు. ముంబై వేదికగా జరిగిన అవార్డుల ప్రదాన కార్యక్రమంలో భారత కెప్టెన్ విరాట్ కొహ్లీతో సహా క్రికెట్ ప్రముఖులు, భారతజట్టు సభ్యులు పాల్గొన్నారు.

పూనమ్ యాదవ్ కు గౌరవం….

మహిళా క్రికెట్లో అంతర్జాతీయ భారత అత్యుత్తమ మహిళా క్రికెటర్ అవార్డును లెగ్ స్పిన్నర్ పూనమ్ యాదవ్ అందుకొంది. భారత్ సిరీస్ విజయాలలో పూనమ్ కీలకపాత్ర పోషించింది.

శ్రీకాంత్ కు సీకె నాయుడు పురస్కారం….

భారత క్రికెట్ బోర్డు ఏటా ప్రదానం చేసే ప్రతిష్టాత్మక సీకెనాయుడు జీవనసాఫల్యం పురస్కారాలను భారత మాజీ కెప్టెన్లు కృష్ణమాచారీ శ్రీకాంత్, అంజుమ్ చోప్రా అందుకోన్నారు.

తమ క్రికెట్ కెరియర్ లో భారత్ క్రికెట్ కు విలక్షణసేవలు అందించిన పురుష, మహిళా క్రికెటర్లకు బీసీసీఐ గత కొద్ది సంవత్సరాలుగా భారత తొలికెప్టెన్ సీకె నాయుడు పేరుతో జీవనసాఫల్య పురస్కారాలు అందచేస్తూ వస్తోంది.

ఇప్పటికే సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్. సలీమ్ దురానీ, దిలీప్ వెంగ్ సర్కార్, శాంతా రంగస్వామి, పద్మాకర్ శివాల్కర్, రాజేందర్ గోయెల్ లాంటి ఎందరో అలనాటి క్రికెటర్లు జీవనసాఫల్య పురస్కారాలను అందుకొన్నవారిలో ఉన్నారు.
2019 సీకేనాయుడు పురస్కారాలకోసం పురుషుల, మహిళల విభాగాలలో భారతమాజీ కెప్టెన్లు కృష్ణమాచారీ శ్రీకాంత్, అంజుమ్ చోప్రాలను బీసీసీఐ ఎంపిక చేసింది.

డాషింగ్ ఓపెనర్ శ్రీకాంత్….

హెల్మెట్లు లేని రోజుల్లోనే కరీబియన్ అరివీరభయంకర ఫాస్ట్ బౌలర్లను నిర్భయంగా ఎదుర్కొని సిక్సర్లు, బౌండ్రీలు అలవోకగా బాదిన మొనగాడు శ్రీకాంత్.

1981- 1992 మధ్యకాలంలో భారత్ కు ఓపెనర్ గా సేవలు అందించిన శ్రీకాంత్ కు 43 టెస్టుల్లో 2 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలతో సహా 2 వేల 62 పరుగులు సాధించిన రికార్డు ఉంది.

కపిల్ దేవ్ నాయకత్వంలో భారత్ 1983 ప్రపంచకప్ సాధించిన జట్టులో సైతం శ్రీకాంత్ కీలక ఆటగాడిగా ఉన్నాడు. ప్రస్తుతం 60 సంవత్సరాల వయసులో శ్రీకాంత్ సీకే నాయుడు అవార్డును అందుకోడం ద్వారా తన క్రికెట్ జీవితాన్ని సాఫల్యం చేసుకోనున్నాడు. 1992లో క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకొన్న శ్రీకాంత్ 2009నుంచి 12 వరకూ చీఫ్ సెలెక్టర్ గా సేవలు అందించారు.

మహిళా క్రికెట్ మేటి అంజుమ్….

42 సంవత్సరాల అంజుమ్ చోప్రాకు ..మిథాలీరాజ్ తర్వాత అత్యంత విజయవంతమైన భారత మహిళాక్రికెటర్ గా పేరుంది. అంజుమ్ తనకెరియర్ లో 12 టెస్టులు ఆడి 548 పరుగులు, 127 వన్డేల్లో 18 హాఫ్ సెంచరీలు, 18 టీ-20లు ఆడటంతో పాటు 2005 మహిళా ప్రపంచకప్ లో రన్నరప్ గా నిలిచిన భారతజట్టులో సభ్యురాలిగా సైతం ఉండటం విశేషం.

ఆస్ట్రేలియాతో ముంబై వేదికగా మంగళవారం తీన్మార్ వన్డే సిరీస్ ప్రారంభానికి ముందే బీసీసీఐ వార్షిక అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషం.

First Published:  12 Jan 2020 10:56 PM GMT
Next Story