Telugu Global
NEWS

పరిపాలన రాజధానిగా విశాఖ.... క్యాబినెట్ ఆమోదం

ఏపీ క్యాబినెట్ సంచలన నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా సీఆర్డీఏని రద్దు చేసింది. విశాఖను పరిపాలన రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా నిర్ణయిస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హైపర్‌ కమిటీ నివేదికకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలని నిర్ణయించింది. పరిపాలన వికేంద్రీకరించాలని… జోనల్ వ్యవస్థకు జగన్ క్యాబినెట్ పచ్చజెండా ఊపింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ…అమరావతి మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ గా మార్పుకు జగన్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మూడు అసెంబ్లీ సమావేశాలు అమరావతి లోనే […]

పరిపాలన రాజధానిగా విశాఖ.... క్యాబినెట్ ఆమోదం
X

ఏపీ క్యాబినెట్ సంచలన నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా సీఆర్డీఏని రద్దు చేసింది. విశాఖను పరిపాలన రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా నిర్ణయిస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హైపర్‌ కమిటీ నివేదికకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.

అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలని నిర్ణయించింది. పరిపాలన వికేంద్రీకరించాలని… జోనల్ వ్యవస్థకు జగన్ క్యాబినెట్ పచ్చజెండా ఊపింది.

సీఆర్డీఏను రద్దు చేస్తూ…అమరావతి మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ గా మార్పుకు జగన్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

మూడు అసెంబ్లీ సమావేశాలు అమరావతి లోనే జరగాలని జగన్ సర్కారు క్యాబినెట్ భేటిలో ఆమోదం తెలిపింది. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూనే విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని నిర్ణయించారు.

అమరావతి కోసం భూములు ఇచ్చి నష్టపోయిన రాజధాని రైతులకు 15 సంవత్సరాల పాటు కౌలు చెల్లించాలని, రాజధాని ప్రాంతంలో ప్లాట్లు అభివృద్ధి చేసి రైతులకు ఇవ్వాలని నిర్ణయించారు. రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయాలని తీర్మానించారు.

కూలీలకు ఇచ్చే పింఛన్ ను 2500 నుంచి 5000కు పెంచడానికి జగన్ క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది.

అమరావతిలో జరిగిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ పై లోకాయుక్త చేత విచారణ జరిపించాలని నిర్ణయించారు.

ఇక రాయలసీమ ప్రజల చిరకాల వాంఛను కూడా జగన్ తీర్చాడు. కర్నూలు లో హైకోర్టు ఏర్పాటు చేయాలని జగన్ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది.

త్వరలోనే 4 జిల్లాలకు కలిపి ఒక సూపర్ కలెక్టర్ ను ఏర్పాటు చేసే విషయం పై కేబినెట్ చర్చించినట్టు తెలిసింది. కలెక్టర్ ల వ్యవస్థ లో మార్పు చేయాలని చర్చించారు.

First Published:  20 Jan 2020 12:34 AM GMT
Next Story