Telugu Global
NEWS

వికేంద్రీకరణను స్వాగతించిన బీజేపీ

చంద్రబాబు చేసిన తప్పిదం వల్లే ఇప్పుడు శాసనమండలిలో పాలనా, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుపై చర్చ జరుగుతోందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. పాలనా వికేంద్రీకరణను బీజేపీ తరపున తాము స్వాగతిస్తున్నామని, ఈ బిల్లులో ప్రాంతీయ బోర్డులు కూడా ఉన్నాయని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చెప్పారు. కర్నూలును రాజధానిగా స్వాగతిస్తున్నామని అన్నారు. గతంలో హైదరాబాద్‌ కేంద్రంగానే అభివృద్ధి జరిగిందని, రాష్ట్రం విడిపోయాక కూడా చంద్రబాబు అభివృద్ధిని ఒకే చోట కేంద్రీకరించాలని ప్రయత్నిస్తున్నారని వీర్రాజు విమర్శించారు. నాడు ప్రధాని మోదీ బొమ్మను […]

వికేంద్రీకరణను స్వాగతించిన బీజేపీ
X

చంద్రబాబు చేసిన తప్పిదం వల్లే ఇప్పుడు శాసనమండలిలో పాలనా, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుపై చర్చ జరుగుతోందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు.

పాలనా వికేంద్రీకరణను బీజేపీ తరపున తాము స్వాగతిస్తున్నామని, ఈ బిల్లులో ప్రాంతీయ బోర్డులు కూడా ఉన్నాయని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చెప్పారు. కర్నూలును రాజధానిగా స్వాగతిస్తున్నామని అన్నారు.

గతంలో హైదరాబాద్‌ కేంద్రంగానే అభివృద్ధి జరిగిందని, రాష్ట్రం విడిపోయాక కూడా చంద్రబాబు అభివృద్ధిని ఒకే చోట కేంద్రీకరించాలని ప్రయత్నిస్తున్నారని వీర్రాజు విమర్శించారు.

నాడు ప్రధాని మోదీ బొమ్మను గాడిదతో తన్నించిన చంద్రబాబు నేడు రాజధాని విషయంలో ఆయన జోక్యం కోరుతున్నారని చురకలంటించారు.

చంద్రబాబు ప్రభుత్వ హయంలో రాజధాని పేరుతో టీడీపీ నేతలు భూములు కొట్టేశారని ఆరోపించారు.

కాపు ఉద్యమం అణిచివేతకు గత ప్రభుత్వం ముద్రగడ స్వగ్రామంలో 3500 మంది పోలీసులను మోహరించిందని వీర్రాజు గుర్తు చేశారు. కాపులు ఉద్యమిస్తే కేసులు బనాయించిన చరిత్ర టీడీపీదని అన్నారు.

నారా లోకేశ్‌ చెప్పిన టీడీపీ అభివృద్ధి వివరాల్లో.. 70 శాతం కేంద్రం నిధులతో చేసినవేనని అన్నారు.

చంద్రన్న బాట పేరుతో రాష్ట్రంలో వేసిన సిమెంట్ రోడ్లన్నీ కేంద్రం నిధులతో వేసినవేనని చెప్పారు.

బందరు పోర్టు నిర్మాణానికి ముఖ్యమంత్రి​ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సిద్ధం కావడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు.

First Published:  22 Jan 2020 4:11 AM GMT
Next Story