Telugu Global
Cinema & Entertainment

బన్నీ, మహేష్.... ఫేక్ రికార్డ్స్ తో పండుగ చేసుకుంటున్నారా?

ఈ సంక్రాంతి ఫైట్ యమ రంజుగా సాగింది. మహేష్ ‘సరిలేరు’, బన్నీ ‘అల వైకుంఠపురం’ మధ్య సై అంటే సై అనేలానే వార్ నడిచింది. ఒకరిని మించి మరొకరు ప్లాన్లు చేశారు. ఈ ఫైట్ లో బన్నీ ‘అల వైకుంఠపురము’కే ఎక్కువ మార్కులు పడ్డాయి. అయితే సంక్రాంతి ముగిసి విజేత ఎవరో తెలిసినా వీరి మధ్య కలెక్షన్ల యుద్ధం మాత్రం ముగియడం లేదు. తాజాగా బాక్సాఫీస్ వద్ద బన్నీ సినిమా రికార్డులు ఆగడం లేదంటూ ఊదరగొట్టేస్తున్నారు. మహేష్ […]

బన్నీ, మహేష్.... ఫేక్ రికార్డ్స్ తో పండుగ చేసుకుంటున్నారా?
X

ఈ సంక్రాంతి ఫైట్ యమ రంజుగా సాగింది. మహేష్ ‘సరిలేరు’, బన్నీ ‘అల వైకుంఠపురం’ మధ్య సై అంటే సై అనేలానే వార్ నడిచింది. ఒకరిని మించి మరొకరు ప్లాన్లు చేశారు. ఈ ఫైట్ లో బన్నీ ‘అల వైకుంఠపురము’కే ఎక్కువ మార్కులు పడ్డాయి. అయితే సంక్రాంతి ముగిసి విజేత ఎవరో తెలిసినా వీరి మధ్య కలెక్షన్ల యుద్ధం మాత్రం ముగియడం లేదు.

తాజాగా బాక్సాఫీస్ వద్ద బన్నీ సినిమా రికార్డులు ఆగడం లేదంటూ ఊదరగొట్టేస్తున్నారు. మహేష్ సరిలేరు కూడా రోజుకో పోస్టర్ విడుదల చేస్తూ ఇండస్ట్రీ రికార్డులంటూ ప్రచారం చేస్తున్నారు.

తాజాగా సరిలేరు నీకెవ్వరు మూవీ 200 కోట్ల గ్రాస్ సాధించిందంటూ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇక దానికి పోటీగా ఏకంగా అల వైకుంఠపురం బ్యాచ్ 220 కోట్ల పోస్టర్ రిలీజ్ చేసింది. నిజానికి ఈ రెండూ ఈ మార్క్ దాటకున్నా ప్రచారం కోసం వీరిద్దరూ పోస్టర్లతో హల్ చల్ చేస్తుండడం విశేషం.

ఇప్పటివరకూ 140 కోట్లు సాధిస్తేనే నాన్ బాహుబలి రికార్డులను తెలుగులో బద్దలు కొట్టినట్టు లెక్క. అలవైకుంఠపురం సినిమాకు ఇంకా ఆదరణ బాగానే ఉంది. అయితే కేవలం రెండు రోజుల్లోనే 40 కోట్లను వసూలు చేసిందని వాళ్లు చెప్పడం హాస్యాస్పదంగా మారింది. హారిక హాసినీ బ్యానర్ ఈ లెక్కలకు దూరంగా ఉండగా.. గీతా ఆర్ట్స్ మాత్రం అధికారిక ట్విట్టర్ లో కలెక్షన్లపై గొప్పలకు పోతోంది.

సరిలేరు కంటే అల వైకుంఠపురం కొంచెం బెటర్ గా సంక్రాంతి పోరులో నిలిచింది. అయితే అంత మాత్రాన కోట్లకు కోట్లు వచ్చిపడ్డాయని ప్రచారం చేసుకోవడంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. సరిలేరు, అల వైకుంఠపురం టీంలు ఇలా 200 కోట్లు దాటేశాయంటూ చేసుకుంటున్న ప్రచారం ఫేక్ అని ఇండస్ట్రీ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి.

First Published:  22 Jan 2020 5:40 AM GMT
Next Story