Telugu Global
NEWS

భారత అమ్ములపొదిలో ఢిల్లీ బుల్లెట్

గంటకు 150 కిలోమీటర్ల వేగంతో నవదీప్ సైనీ ప్రపంచంలోనే అత్యుత్తమ ఫాస్ట్ బౌలింగ్ ఎటాక్ కలిగిన భారతజట్టులోకి..మరో మెరుపు ఫాస్ట్ బౌలర్ దూసుకొచ్చాడు. గంటకు 150 కిలోమీటర్ల మెరుపువేగంతో బంతులు విసురుతూ ప్రత్యర్థిజట్ల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు. ఇండోర్ హోల్కార్ స్టేడియం వేదికగా ఇటీవలే శ్రీలంకతో ముగిసిన తొలి టీ-20మ్యాచ్ లో భారత యువఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీ మెరుపువేగంతో బంతులు విసిరి ప్రత్యర్థి టాపార్డర్ ను బెంబేలెత్తించాడు. శ్రీలంకతో ముగిసిన టీ-20 సిరీస్ రెండుమ్యాచ్ ల్లో 5వికెట్లు పడగొట్టి […]

భారత అమ్ములపొదిలో ఢిల్లీ బుల్లెట్
X
  • గంటకు 150 కిలోమీటర్ల వేగంతో నవదీప్ సైనీ

ప్రపంచంలోనే అత్యుత్తమ ఫాస్ట్ బౌలింగ్ ఎటాక్ కలిగిన భారతజట్టులోకి..మరో మెరుపు ఫాస్ట్ బౌలర్ దూసుకొచ్చాడు. గంటకు 150 కిలోమీటర్ల మెరుపువేగంతో బంతులు విసురుతూ ప్రత్యర్థిజట్ల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు.

ఇండోర్ హోల్కార్ స్టేడియం వేదికగా ఇటీవలే శ్రీలంకతో ముగిసిన తొలి టీ-20మ్యాచ్ లో భారత యువఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీ మెరుపువేగంతో బంతులు విసిరి ప్రత్యర్థి టాపార్డర్ ను బెంబేలెత్తించాడు. శ్రీలంకతో ముగిసిన టీ-20 సిరీస్ రెండుమ్యాచ్ ల్లో 5వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకొన్నాడు.

ఢిల్లీ రంజీజట్టు ద్వారా దేశవాళీ క్రికెట్లోకి దూసుకొచ్చిన నవదీప్ సైనీ గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగల యువబౌలర్ గా గుర్తింపు తెచ్చుకొన్నాడు.

దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణించడం ద్వారా 2018 సీజన్లో ఐపీఎల్ బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టులో 3 కోట్ల రూపాయల ధరకు చేరాడు. అ తర్వాత భారత వన్డే జట్టులోనూ, ప్రస్తుత శ్రీలంక సిరీస్ ద్వారా వన్డే జట్టులోను చేరగలిగాడు.

మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా నవదీప్…

శ్రీలంకతో ముగిసిన టీ-20 సిరీస్ లో నవదీప్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకొన్నాడు. తొలి మ్యాచ్ లో నవదీప్ సైనీ తన కోటా 4 ఓవర్లలో 13 డాట్ బాల్స్ తో…. 18 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టడం ద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

ఓపెనర్ ధనుష్క గుణతిలకను 148 కిలోమీటర్ల వేగంతో విసిరిన యార్కర్ తో క్లీన్ బౌల్డ్ చేయడం ద్వారా పెవీలియన్ దారి పట్టించాడు. అ తర్వాత…. ఒషేడా ఫెర్నాండోను గంటకు 150 కిలోమీటర్ల వేగంతో కూడిన బంతితో పడగొట్టాడు.

భారత క్రికెట్లో ప్రస్తుతం గంటకు 150 కిలోమీటర్ల వేగాన్ని క్రమం తప్పకుండా అందుకొంటున్న ఏకైక ఫాస్ట్ బౌలర్ 27 సంవత్సరాల నవదీప్ సైనీ మాత్రమే.

భారత ఫాస్టెస్ట్ బౌలర్ బుమ్రా…

భారత క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా బౌల్ చేసిన ఫాస్ట్ బౌలర్ రికార్డు జస్ ప్రీత్ బుమ్రా పేరుతో ఉంది. గత ఏడాది ఆస్ట్ర్రేలియా పర్యటన సమయంలో బుమ్రా 153 కిలోమీటర్ల వేగంతో బౌల్ చేసి…భారత ఫాస్ట్ బౌలర్ల సత్తా ఏపాటిదో ప్రపంచానికి చాటి చెప్పాడు.

భారత ప్రస్తుత ఫాస్ట్ బౌలర్లలో 152 కిలోమీటర్ల వేగంతో బౌల్ చేసిన ఘనత ఉమేశ్ యాదవ్, ఇశాంత్ శర్మలకు సైతం ఉంది.

ఆల్ టైమ్ గ్రేట్ షోయబ్ అక్తర్..

ఆధునిక క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా బౌల్ చేసిన బౌలర్ ప్రపంచ రికార్డు పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ పేరుతో ఉంది. 2003 సిరీస్ లో భాగంగా ఇంగ్లండ్ తో ముగిసిన మ్యాచ్ ల్లో షోయబ్ అక్తర్ గంటకు 163 కిలోమీటర్ల వేగంతో నిప్పులు చెరిగాడు. ఈ ఘనత సాధించిన తొలిబౌలర్ గా చరిత్ర సష్టించాడు.

First Published:  28 Jan 2020 3:12 AM GMT
Next Story