Telugu Global
NEWS

జగన్ సీరియస్.... టీడీపీకి జీఎన్ రావు నివేదిక లీక్ చేసిందెవరు?

ఏపీకి 3 రాజధానులపై జీఎన్ రావు నేతృత్వంలో ప్రభుత్వం 5 సభ్యులతో కమిటీ వేసి రిపోర్టును తీసుకుంది. అందులో జీఎన్ రావు కమిటీ విశాఖ పరిపాలన రాజధానిపై సవివరమైన నివేదికను ఇచ్చింది. అయితే ఆ నివేదికలో విశాఖ పరిపాలన రాజధానిపై జీఎన్ రావు పొందుపరిచిన అంశాలను ఎలాగో సంపాదించిన టీడీపీ మీడియా దాన్ని చిలువలు పలువలు చేసి మీడియాలో రచ్చ చేస్తోంది. జగన్ సర్కారును ఇరుకున పెడుతోంది. వైఎస్ జగన్ ప్రభుత్వానికి విశాఖ రాజధాని తీరప్రాంతం బెస్ట్ […]

జగన్ సీరియస్.... టీడీపీకి జీఎన్ రావు నివేదిక లీక్ చేసిందెవరు?
X

ఏపీకి 3 రాజధానులపై జీఎన్ రావు నేతృత్వంలో ప్రభుత్వం 5 సభ్యులతో కమిటీ వేసి రిపోర్టును తీసుకుంది. అందులో జీఎన్ రావు కమిటీ విశాఖ పరిపాలన రాజధానిపై సవివరమైన నివేదికను ఇచ్చింది.

అయితే ఆ నివేదికలో విశాఖ పరిపాలన రాజధానిపై జీఎన్ రావు పొందుపరిచిన అంశాలను ఎలాగో సంపాదించిన టీడీపీ మీడియా దాన్ని చిలువలు పలువలు చేసి మీడియాలో రచ్చ చేస్తోంది. జగన్ సర్కారును ఇరుకున పెడుతోంది. వైఎస్ జగన్ ప్రభుత్వానికి విశాఖ రాజధాని తీరప్రాంతం బెస్ట్ కాదని జీఎన్ రావు కమిటీ రిపోర్ట్ ఇచ్చారంటూ రాద్ధాంతం చేస్తోంది.

జీఎన్ రావు పూర్తి కమిటీ నివేదికను టీడీపీ మీడియా బృందానికి లీక్ చేసిందెవరనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దీన్ని దాడి చేయడానికి ఉపయోగిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.

జీఎన్ రావు కమిటీ నివేదిక టీడీపీ మీడియాకు లీక్ కావడంపై సీఎం జగన్ సీరియస్ అయినట్టు తెలిసింది. ప్రభుత్వానికి పరిపాలనపై నియంత్రణ లేకపోవడాన్ని ఇది సూచిస్తుందని జగన్ ఆగ్రహంగా ఉన్నారట…. రహస్యమైన జీఎన్ రావు, బోస్టన్ కమిటీ పూర్తి స్థాయి నివేదికను బహిరంగ పరచకుండా, అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా… కేవలం రిపోర్టు సారాంశాన్ని మాత్రమే జగన్ ప్రభుత్వం విడమరిచి చెప్పింది.

అయితే సరిగ్గా టీడీపీ మీడియాకు ఇది లీక్ చేసింది జగన్ ప్రభుత్వంలో ఉన్న అత్యున్నత స్థాయి కొందరు అధికారులు అని జగన్ సర్కారు భావిస్తోంది. చాలా రహస్యమైన ప్రభుత్వ ఉత్తర్వులను కూడా టీడీపీ సంపాదించడానికి ఆ అధికారులే కుట్ర చేస్తున్నారని సీఎం జగన్ అనుమానిస్తున్నారట.

ఐదేళ్లు అధికారంలో ఉన్న టీడీపీకి అనుకూలంగా చాలామంది సీనియర్లు జగన్ ప్రభుత్వంలో రహస్యంగా ఈ పనులు చేస్తున్నట్టు తెలుస్తోంది. జగన్ సర్కారు ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నా… చంద్రబాబు, టీడీపీ మీడియా అధికారులతో కలిసి ఇలా లీకులు చేయడంపై జగన్ సీరియస్ గా ఉన్నట్టు తెలిసింది. ఇది ఎవరు చేశారో నిగ్గు తేల్చి అధికారులను సస్పెండ్ చేసేందుకు రెడీ అయినట్టు తెలిసింది.

First Published:  30 Jan 2020 3:46 AM GMT
Next Story