Telugu Global
CRIME

సమత కేసులో సంచలన తీర్పు.... ముగ్గురికి ఉరిశిక్ష

కొమ్రం భీం జిల్లాలో జరిగిన దారుణ హత్యాచార ఘటనకు ముగింపు పడింది. మహిళపై అత్యాచారం చేసి హతమార్చిన ముగ్గురు నిందితులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏకంగా ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. సమత కేసులో ముగ్గురికి ఉరిశిక్ష విధిస్తూ ఆదిలాబాద్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు గురువారం సంచలన తీర్పును ఇచ్చింది. దీంతో సమత కోసం పోరాడిన ప్రజాసంఘాలు, మహిళలు, న్యాయవాదులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో హర్షం వ్యక్తం చేశారు. గత ఏడాది నవంబర్ 24న కొమ్రం భీం […]

సమత కేసులో సంచలన తీర్పు.... ముగ్గురికి ఉరిశిక్ష
X

కొమ్రం భీం జిల్లాలో జరిగిన దారుణ హత్యాచార ఘటనకు ముగింపు పడింది. మహిళపై అత్యాచారం చేసి హతమార్చిన ముగ్గురు నిందితులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏకంగా ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.

సమత కేసులో ముగ్గురికి ఉరిశిక్ష విధిస్తూ ఆదిలాబాద్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు గురువారం సంచలన తీర్పును ఇచ్చింది. దీంతో సమత కోసం పోరాడిన ప్రజాసంఘాలు, మహిళలు, న్యాయవాదులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో హర్షం వ్యక్తం చేశారు.

గత ఏడాది నవంబర్ 24న కొమ్రం భీం జిల్లా ఎల్లాపటార్ సమీపంలో ముగ్గురు కామాంధులు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సమతను కాపుకాచి , పొదల్లొకి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ నకు పాల్పడ్డారు. ఈ విషయం బయటకు పొక్కితే తమకే ప్రమాదం అని భావించిన ముగ్గురు నిందితులు సమతను దారుణంగా హత్యచేశారు.

దిశ ఘటన జరిగినప్పుడే జరిగిన ఈ సమత కేసుపై ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. పత్రికలు, మీడియాలోనూ హైలెట్ అయ్యింది. దీంతో ప్రభుత్వం, పోలీసులు స్పందించి… ముగ్గురు నిందితులను వెంటనే అరెస్ట్ చేశారు. విచారణ వేగవంతం కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి వేగంగా విచారణ జరిపి పూర్తి చేశారు.

సమతపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో ముద్దాయిలైన ఏ1 షేక్ బాబు, ఏ2 షాబుద్దీన్, ఏ3 షేక్ ముగ్దుమ్ లకు ఉరిశిక్షను విధిస్తూ చారిత్రక తీర్పును వెలువరించింది. మొత్తం 140 పేజీల చార్జిషీట్ లో మృతురాలి చీరపై ఉన్న స్పెర్మ్ ఆధారంగా నిందితులను గుర్తించినట్టు పోలీసులు పేర్కొన్నారు. కోర్టుకు ఆధారాలు సమర్పించడంతో ముగ్గురికి కోర్టు ఉరిశిక్ష విధించింది.

First Published:  30 Jan 2020 3:40 AM GMT
Next Story