Telugu Global
NEWS

జేసీ దివాకర్ రెడ్డి గనుల లీజ్‌ రద్దు

అనంతపురము జిల్లా యాడికి లోని మెస్సర్స్ త్రిషూల్ సిమెంట్ కంపెనీకి  ప్రభుత్వం ఇచ్చిన గనుల లీజుల్ని రద్దు చేసింది. యాడికి లోని కొనుప్పలపాడులో ఉన్న సర్వే నెంబరు 22 బి లో ఉన్న 649.86 హెక్టార్ల పరిధిలోని సున్నపు రాతి గనుల లీజుల్ని రద్దు చేస్తూ ఈరోజు ఉత్తర్వులు వెలువరించింది. సిమెంట్ తయారీ ప్లాంట్ నిర్మాణానికి మరో ఐదేళ్ల పొడిగింపు ఇస్తూ గతంలో జారీ చేసిన ఉత్తర్వుల్ని కూడా ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి ఇప్పటి […]

జేసీ దివాకర్ రెడ్డి గనుల లీజ్‌ రద్దు
X

అనంతపురము జిల్లా యాడికి లోని మెస్సర్స్ త్రిషూల్ సిమెంట్ కంపెనీకి ప్రభుత్వం ఇచ్చిన గనుల లీజుల్ని రద్దు చేసింది.

యాడికి లోని కొనుప్పలపాడులో ఉన్న సర్వే నెంబరు 22 బి లో ఉన్న 649.86 హెక్టార్ల పరిధిలోని సున్నపు రాతి గనుల లీజుల్ని రద్దు చేస్తూ ఈరోజు ఉత్తర్వులు వెలువరించింది.

సిమెంట్ తయారీ ప్లాంట్ నిర్మాణానికి మరో ఐదేళ్ల పొడిగింపు ఇస్తూ గతంలో జారీ చేసిన ఉత్తర్వుల్ని కూడా ప్రభుత్వం వెనక్కు తీసుకుంది.

ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి ముందడుగూ పడనందునే.. ఈ రద్దు ఉత్తర్వులు జారీ చేసినట్టు ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొన్నారు.

లీజు ప్రాంతం నుంచి 38 వేల 212 మెట్రిక్ టన్నుల సున్నపు రాయి నిక్షేపాన్ని అక్రమంగా తవ్వితీయటం, రవాణా చేయటంపై విచారణ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

First Published:  31 Jan 2020 7:00 AM GMT
Next Story