Telugu Global
NEWS

రోజా ఆడియో మెసేజ్.... వైసీపీలో కలకలం

వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ రోజా ఆడియో మెసేజ్ వైసీపీ వర్గాల్లో కలకలం రేపుతోంది. అధికార పార్టీలో అంతా సామరస్యంగా ఉందని భావించిన వారికి రోజా ఆడియో విన్నాక స్పష్టంగా మంత్రి పెద్దిరెడ్డితో ఆమెకు విభేదాలున్నాయన్న విషయం ఇట్టే తెలిసిపోతోందంటున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆడియో ఒకటి వైసీపీ వర్గాల్లో వైరల్ అయ్యింది. మీడియాలోనూ ఇది హైలైట్ అయ్యింది. మంత్రి పెద్దిరెడ్డి హాజరయ్యే కార్యక్రమానికి తన నగరి నియోజకవర్గంలోని నేతలెవరూ హాజరు కావద్దని.. ఒకవేళ హాజరు […]

రోజా ఆడియో మెసేజ్.... వైసీపీలో కలకలం
X

వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ రోజా ఆడియో మెసేజ్ వైసీపీ వర్గాల్లో కలకలం రేపుతోంది. అధికార పార్టీలో అంతా సామరస్యంగా ఉందని భావించిన వారికి రోజా ఆడియో విన్నాక స్పష్టంగా మంత్రి పెద్దిరెడ్డితో ఆమెకు విభేదాలున్నాయన్న విషయం ఇట్టే తెలిసిపోతోందంటున్నారు.

తాజాగా వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆడియో ఒకటి వైసీపీ వర్గాల్లో వైరల్ అయ్యింది. మీడియాలోనూ ఇది హైలైట్ అయ్యింది.

మంత్రి పెద్దిరెడ్డి హాజరయ్యే కార్యక్రమానికి తన నగరి నియోజకవర్గంలోని నేతలెవరూ హాజరు కావద్దని.. ఒకవేళ హాజరు అయితే వారికి ఇక పార్టీతో సంబంధం లేనట్టేనని రోజా మాట్లాడిన ఆడియో వైరల్ గా మారింది.

కేజే కుమార్ అనే వ్యక్తి ఇంట్లో జరిగే కార్యక్రమానికి మంత్రి పెద్దిరెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి హాజరయ్యారు. వీరు వచ్చే వేడుకకు హాజరు కావద్దని రోజా తన నియోజకవర్గ నాయకులకు అల్టీమేటం జారి చేసిన ఆడియో ఇప్పుడు వైసీపీలో చర్చనీయాంశమైంది. మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్యే రోజాకు పడట్లేదని అర్థమవుతోంది.

రోజాకు మంత్రి పదవి రాకుండా అడ్డుకున్నది పెద్దిరెడ్డి అనే ప్రచారం వైసీపీ వర్గాల్లో విస్తృతంగా సాగింది. రోజా కూడా పలువురి వద్ద ఇదే బాధను వ్యక్తం చేసినట్టు తెలిసింది. అందుకే ఇప్పటికీ రోజా మంత్రి పెద్దిరెడ్డిని సహించడం లేదని.. ఆయన తనను తొక్కేశారని.. నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని.. ఎవరు ఆయన ఫంక్షన్ కు వెళ్లినా బాగుండదని ఆడియోలో రోజా హెచ్చరించిన వైనం కలకలం రేపుతోంది.

First Published:  31 Jan 2020 6:52 AM GMT
Next Story