Telugu Global
National

పాపం కేంద్ర మంత్రి నిర్మల... భారీ ప్రసంగంతో డీలా

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. తన బడ్జెట్ ప్రసంగంతో రికార్డు సృష్టించారు. కానీ.. అదే సమయంలో తీవ్రంగా డీలా పడ్డారు. ఏకధాటిన 160 నిముషాల పాటు బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగించిన ఆమె.. చివర్లో కాస్త తడబాటుకు గురయ్యారు. బీపీ తగ్గిన కారణంగా.. నుదుటిపై చెమటలు రావడం.. ప్రసంగం కొనసాగించే శక్తి సన్నగిల్లడంతో.. ఆమె చివరి రెండు పేజీల ప్రసంగాన్ని ఆపేశారు. అది కూడా తాను చదివినట్టుగానే భావించాల్సిందిగా సభాపతిని అభ్యర్థించారు. అయితే.. ప్రసంగం మధ్యలో.. తోటి […]

పాపం కేంద్ర మంత్రి నిర్మల... భారీ ప్రసంగంతో డీలా
X

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. తన బడ్జెట్ ప్రసంగంతో రికార్డు సృష్టించారు. కానీ.. అదే సమయంలో తీవ్రంగా డీలా పడ్డారు. ఏకధాటిన 160 నిముషాల పాటు బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగించిన ఆమె.. చివర్లో కాస్త తడబాటుకు గురయ్యారు. బీపీ తగ్గిన కారణంగా.. నుదుటిపై చెమటలు రావడం.. ప్రసంగం కొనసాగించే శక్తి సన్నగిల్లడంతో.. ఆమె చివరి రెండు పేజీల ప్రసంగాన్ని ఆపేశారు.

అది కూడా తాను చదివినట్టుగానే భావించాల్సిందిగా సభాపతిని అభ్యర్థించారు. అయితే.. ప్రసంగం మధ్యలో.. తోటి సభ్యులు.. మంత్రి నిర్మలకు కాస్త చక్కెర అందించే ప్రయత్నం చేశారు. కానీ.. ఆమె సున్నితంగా తిరస్కరించారు. వద్దని వారించారు. ఇలా.. 2 గంటల 40 నిముషాలపాటు ఆగకుండా.. స్పష్టంగా.. సూటిగా ప్రసంగం చేశారు. చణుకులు విసురుతూ.. మహనీయుల మాటలు వాడుతూ.. ఆకట్టుకున్నారు.

కానీ.. చివరికి శక్తి సన్నగిల్లి డీలా పడ్డారు. స్వల్ప అస్వస్థతకు లోనైనట్టు గుర్తించగానే అప్రమత్తమై.. సభాపతికి తన పరిస్థితిని వివరించారు. దాదాపుగా ప్రసంగాన్ని పూర్తి చేసిన ఆమె.. చివరి 2 పేజీలను మాత్రం వదిలేశారు. అయినా.. గత మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా.. 2 గంటల 17 నిముషాల పాటు ఏకధాటిన పద్దుల ప్రసంగం చేసిన తన రికార్డును… నిర్మల ఈ సారి తానే అధిగమించడం విశేషం.

ఇలా.. లోక్ సభలో పద్దుల ముచ్చట చెప్పిన అనంతరం.. రాజ్యసభలోనూ ఆమె బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అనంతరం.. సభను ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు.. సోమవారానికి వాయిదా వేశారు.

First Published:  1 Feb 2020 9:03 PM GMT
Next Story