Telugu Global
Cinema & Entertainment

మైనపు బొమ్మగా మారిన పంచదార బొమ్మ

ప్రభాస్, మహేష్ సరసన చేరిపోయింది కాజల్. నిజానికి వీళ్ల ముగ్గురి మధ్య పోలిక తీసుకురావడానికి ఏం లేదు. కానీ ఒకే ఒక్క విషయంలో ప్రభాస్, మహేష్ కు సరితూగింది ఈ అమ్మాయి. అవును.. కాజల్ మైనపు బొమ్మను ప్రతిష్టించారు. టాలీవుడ్ నుంచి ప్రభాస్, మహేష్ తర్వాత ఆ అరుదైన ఘనత కాజల్ కే దక్కింది. అంతేకాదు.. సౌతిండియా నుంచి మేడమ్ టుస్సాడ్స్ లో కొలువుదీరిన ఏకైక హీరోయిన్ మైనపు ప్రతిమ కూడా కాజల్ దే. సింగపూర్ లో […]

మైనపు బొమ్మగా మారిన పంచదార బొమ్మ
X

ప్రభాస్, మహేష్ సరసన చేరిపోయింది కాజల్. నిజానికి వీళ్ల ముగ్గురి మధ్య పోలిక తీసుకురావడానికి ఏం లేదు. కానీ ఒకే ఒక్క విషయంలో ప్రభాస్, మహేష్ కు సరితూగింది ఈ అమ్మాయి. అవును.. కాజల్ మైనపు బొమ్మను ప్రతిష్టించారు. టాలీవుడ్ నుంచి ప్రభాస్, మహేష్ తర్వాత ఆ అరుదైన ఘనత కాజల్ కే దక్కింది. అంతేకాదు.. సౌతిండియా నుంచి మేడమ్ టుస్సాడ్స్ లో కొలువుదీరిన ఏకైక హీరోయిన్ మైనపు ప్రతిమ కూడా కాజల్ దే.

సింగపూర్ లో ఈరోజు కాజల్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ విగ్రహావిష్కరణకు కుటుంబంతో పాటు సింగపూర్ వెళ్లింది కాజల్. ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్ గా మారుతున్నాయి. ఇంతకుముందు ప్రభాస్ మైనపు విగ్రహాన్ని బ్యాంకాంక్ లోని మేడమ్ టుస్సాడ్స్ బ్రాంచ్ లో పెట్టారు. ఆ తర్వాత మహేష్ మైనపు విగ్రహాన్ని సింగపూర్ లో పెట్టారు. ఇప్పుడు అదే సింగపూర్ బ్రాంచ్ లో కాజల్ మైనపు విగ్రహాన్ని కూడా చూడొచ్చు.

ఈ విగ్రహం కోసం 3 నెలల కిందటే కొలతలు ఇచ్చింది కాజల్. అది ఇన్నాళ్లకు తయారైంది. మొత్తానికి కొత్త ఏడాదిలో కాజల్ ఇలా స్పెషల్ గిఫ్ట్ అందుకుంది.

First Published:  5 Feb 2020 3:36 AM GMT
Next Story