Telugu Global
National

ఉడాన్ సేవలు విస్తరిస్తున్న ట్రూజెట్‌, నెట్‌వర్క్‌ పరిధిలోకి కొత్తగా బీదర్‌

• బీదర్‌ వాసులకు చేరువకానున్న బెంగళూరు • బెంగళూరు-బీదర్‌-బెంగళూరు ట్రూజెట్‌ విమాన సర్వీసును ప్రారంభించిన కర్ణాటక సీఎం బి.ఎస్‌.యడ్యూరప్ప • ట్రూజెట్‌ నెట్‌వర్క్‌లో 24వ పట్టణంగా బీదర్‌ • ప్రతీ రోజు బెంగళూరు-బీదర్‌-బెంగళూరు మధ్య విమాన సేవలు • ట్రూజెట్‌ విమానంలో బెంగళూరు నుంచి బీదర్‌ వరకు ప్రయాణించిన ముఖ్యమంత్రి యడ్యూరప్ప, మంత్రులు ఉడాన్‌ నెట్‌వర్క్‌ సేవల విస్తరణలో భాగంగా హైదరాబాద్‌ టర్బో మేఘా ఎయిర్‌వేస్‌కు చెందిన ట్రూజెట్‌ కొత్తగా ఈశాన్య కర్ణాటకలోని బీదర్‌ నుంచి విమానసేవలు […]

ఉడాన్ సేవలు విస్తరిస్తున్న ట్రూజెట్‌, నెట్‌వర్క్‌ పరిధిలోకి కొత్తగా బీదర్‌
X

• బీదర్‌ వాసులకు చేరువకానున్న బెంగళూరు
• బెంగళూరు-బీదర్‌-బెంగళూరు ట్రూజెట్‌ విమాన సర్వీసును ప్రారంభించిన కర్ణాటక సీఎం బి.ఎస్‌.యడ్యూరప్ప
• ట్రూజెట్‌ నెట్‌వర్క్‌లో 24వ పట్టణంగా బీదర్‌
• ప్రతీ రోజు బెంగళూరు-బీదర్‌-బెంగళూరు మధ్య విమాన సేవలు
• ట్రూజెట్‌ విమానంలో బెంగళూరు నుంచి బీదర్‌ వరకు ప్రయాణించిన ముఖ్యమంత్రి యడ్యూరప్ప, మంత్రులు

ఉడాన్‌ నెట్‌వర్క్‌ సేవల విస్తరణలో భాగంగా హైదరాబాద్‌ టర్బో మేఘా ఎయిర్‌వేస్‌కు చెందిన ట్రూజెట్‌ కొత్తగా ఈశాన్య కర్ణాటకలోని బీదర్‌ నుంచి విమానసేవలు ప్రారంభించింది. బీదర్‌ నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరు మధ్య… నేటి నుంచి ప్రతీ రోజు విమాన సేవలు అందుబాటులోకి వచ్చాయి. బెంగళూరు ఎయిర్‌పోర్టులో ఈ సర్వీసు ప్రారంభించిన కర్ణాటక ముఖ్యమంత్రి బి.ఎస్.యడ్యూరప్ప, ట్రూజెట్‌ విమానంలో బీదర్‌ వరకు ప్రయాణించారు.

సీఎం యడ్యూరప్పతో పాటు మంత్రులు, బీదర్‌ ప్రజాప్రతినిధులు ప్రయాణం చేశారు. అనంతరం ముఖ్యమంత్రి యడ్యూరప్ప మాట్లాడుతూ బెంగళూరు విమానాశ్రయం నుంచి బీదర్‌కు కేవలం గంటా 40 నిమిషాల్లోనే చేరుకున్నామని, సాధారణంగా బెంగళూరు నుంచి బస్సులో బీదర్‌కు చేరుకోవాలంటే 12 గంటల ప్రయాణం అవుతుందని ట్రూజెట్‌ విమాన సర్వీసుల వల్ల ప్రయాణ దూరం భారం తగ్గిందని విమానసర్వీసుల పట్ల సీఎం యడ్యూరప్ప హర్షం వ్యక్తం చేశారు. బీదర్ పరిధిలో ఉన్న “కళ్యాణ కర్నాటక” అభివృద్ధికి ట్రూజెట్‌ విమాన సర్వీసులు మరింత దోహదపడతాయని ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఆకాంక్షించారు.

బెంగళూరు-బీదర్‌- బెంగళూరు మధ్య ట్రూజెట్‌ విమాన రాకపోకల సమయం:

ఫ్లైట్‌ నెం. ప్రారంభం గమ్యస్థానం బయల్దేరు సమయం చేరుకునే సమయం
2T625 బెంగళూరు బీదర్‌ 11:25 am 1:05 pm
2T626 బీదర్‌ బెంగళూరు 1:35 pm 3:15 pm

ట్రూజెట్‌ నెట్‌వర్క్‌లో బీదర్‌ 24వ స్టేషన్ కాబోతోంది. ప్రాంతీయ అనుసంధాన పథకం (ఆర్‌సీఎస్‌)- ఉడే దేశ్‌కా ఆమ్‌ నాగరిక్‌ (ఉడాన్‌), సామాన్య మానవులు కూడా విమానాల్లో ప్రయాణించాలన్న ప్రధానమంతి ప్రయత్నాల్లో భాగంగా ట్రూజెట్‌ విమానాల్లో 65 శాతానికి పైగా ప్రాంతీయ విమానాశ్రయాలకు అనుసంధానమై ఉన్నాయి. ఆర్‌సీఎస్‌ I, II, III కింద తనకు అప్పగించిన మార్గాల్లో పూర్తిగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏకైక సంస్థ ట్రూజెట్‌.

బెంగళూరు-బీదర్‌-బెంగళూరు విమానసేవలు ప్రారంభం సందర్భంగా మాట్లాడుతూ టర్బో మేఘా ఎయిర్‌వేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌, కె.వి.ప్రదీప్‌… “మా మొదటి ప్రయాణాన్ని జూలై 12, 2015న మొదలపెట్టిన నాటి నుంచి మేము చాలా దూరం ప్రయాణించాం. భారత్‌లోని ప్రథమశ్రేణి నగరాల నుంచి సామాజిక-ఆర్థిక అభివృద్ధిని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించాలన్న జాతి ఆకాంక్షలను మేము నెరవేర్చుతున్నామని గొప్పగా చెప్పుకుంటున్నాం. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విమాన సేవలు అందించడం ద్వారా ఆ ప్రాంతాల్లో వ్యాపారానికి, పర్యటక అభివృద్ధికి మేము దోహదపడుతున్నాం. విమాన అనుసంధానం అన్నది ఆర్థికవ్యవస్థకు అండగా నిలవడమే కాదు ఉపాధి కల్పనకు సహకరిస్తుంది. దీని ద్వారా సామాజిక-ఆర్థిక ప్రగతి అన్నది ఇతర నగరాలకు విస్తరిస్తుంది. ఈ ప్రగతిలో భాగస్వామిగా నిలుస్తున్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది.”

టర్బో మేఘా ఎయిర్‌వేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, సీఈఓ కల్నల్‌ ఎల్‌.ఎస్‌.ఎన్‌.మూర్తి మాట్లాడుతూ, “ప్రాంతీయ విమాన అనుసంధానంలో బలమైన శక్తిగా ట్రూజెట్‌ నిలుస్తుంది. నాలుగేళ్ల స్వల్ప వ్యవధిలో మేము మా నెట్‌వర్క్‌ను 24 స్టేషన్లకు విస్తరించగలిగాం. ఆర్‌సీఎస్‌ I, II, III కింద మా నిబద్ధతను చాటుకున్నందుకు మేము గర్వపడుతున్నాం. దేశంలో ఆర్థికశక్తులుగా ఎదుగుతున్న ప్రాంతాల్లో బలమైన ప్రాంతీయ విమానయాన సంస్థగా ఎదిగేందుకు మేము సుస్థిర అభివృద్ధి వ్యూహాన్ని రూపొందించాం.”

బెంగళూరు-బీదర్‌-బెంగళూరు మధ్య కొత్త సర్వీసు ప్రారంభించిన సందర్భంగా ఈ ఆనందాన్ని పంచుకునేందుకు మా నెట్‌వర్క్‌ పరిధిలో 4 రోజుల పాటు టికెట్‌ బేస్‌ ధరను రూ.699/-*గా అందిస్తున్నాం.

ట్రూజెట్ గురించి:

హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న టర్బో మేఘా ఎయిర్ వేస్ ప్రమోట్ చేసిన ప్రాంతీయ విమానయాన సంస్థ ట్రూజెట్. ప్రముఖ వ్యాపార, ఆధ్యాత్మిక కేంద్రాల మధ్య సౌకర్యవంతమైన అనుసంధాన సేవలు అందిస్తోంది ట్రూజెట్. ATR -72 విమానాలు ఏడింటిని కలిగిన ట్రూజెట్ ప్రస్తుతం హైదరాబాద్, అహ్మదాబాద్, చెన్నై కేంద్రంగా ఔరంగాబాద్, బెల్గాం, బెంగళూరు, బీదర్, కడప, గోవా, ఇండోర్, జైసల్మేర్, జల్గావ్, కాండ్లా, కొల్హాపూర్, ముంబయి, మైసూరు, నాందేడ్, నాసిక్, పోరుబందర్, రాజమండ్రి, సేలం, తిరుపతి, విద్యానగర్, విజయవాడ వంటి 24 ప్రాంతాలకు విమానాలు నడుపుతోంది.

First Published:  7 Feb 2020 3:02 AM GMT
Next Story