Telugu Global
CRIME

కరీంనగర్‌లో యువతి దారుణ హత్య

కరీంనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఇంటర్‌ విద్యార్థిని రాధిక గొంతు కోసి చంపారు. విద్యానగర్‌లో ఈ ఘటన జరిగింది. మృతురాలు సహస్ర జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. విద్యానగర్‌లోని పద్మావతి ఫంక్షన్‌ హాల్‌ వెనుకభాగంలో ఉన్న రాధిక ఇంట్లో ఆమెను దుండగుడు హతమార్చాడు. రాధిక తల్లిదండ్రులు రోజు కూలీలుగా పనిచేస్తున్నారు. సాయంత్రం వారు ఇంటికి వచ్చి చూసేసరికి రక్తపుమడుగులో కుమార్తె పడి ఉండటం చూసి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ క్రమంలో పోలీసులకు సమాచారం అందించడంతో […]

కరీంనగర్‌లో యువతి దారుణ హత్య
X

కరీంనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఇంటర్‌ విద్యార్థిని రాధిక గొంతు కోసి చంపారు. విద్యానగర్‌లో ఈ ఘటన జరిగింది. మృతురాలు సహస్ర జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది.

విద్యానగర్‌లోని పద్మావతి ఫంక్షన్‌ హాల్‌ వెనుకభాగంలో ఉన్న రాధిక ఇంట్లో ఆమెను దుండగుడు హతమార్చాడు. రాధిక తల్లిదండ్రులు రోజు కూలీలుగా పనిచేస్తున్నారు. సాయంత్రం వారు ఇంటికి వచ్చి చూసేసరికి రక్తపుమడుగులో కుమార్తె పడి ఉండటం చూసి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ క్రమంలో పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.

అయితే దుండగుడు ఎందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. మరోవైపు పోలీసులు బృందాలుగా ఏర్పడి దుండగుడి కోసం గాలిస్తున్నారు. గతంలో.. ఈ ఇంట్లో ముగ్గురు యువకులు అద్దెకు ఉండేవారు. వారిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

త‌మ‌కు ఎవ‌రూ శ‌త్రువులు లేర‌ని త‌ల్లిదండ్రులు అంటున్నారు. మొత్తానికి రాధికను ఎవ‌రు చంపారు అనేది మిస్ట‌రీగా మారింది.

First Published:  10 Feb 2020 8:28 PM GMT
Next Story