Telugu Global
Cinema & Entertainment

యుద్ధం ఇంకా ముగిసిపోలేదు

సంక్రాంతి సినిమాలొచ్చి చాన్నాళ్లు గడిచిపోయాయి. ప్రస్తుతం మహేష్, బన్నీ సినిమాలు 5వ వారంలోకి వచ్చేశాయి. మహా అయితే మరో వారం రోజులు. కలెక్షన్ల వివరాలు, పోస్టర్ల హడావుడి కూడా బాగా తగ్గింది. ఇలా అంతా స్తబ్దుగా మారిందని అంతా అనుకుంటున్నారు. కానీ అసలు కథ ముందుంది. సునామీ సైలెంట్ గా వస్తోంది. అవును.. అటు బన్నీ, ఇటు మహేష్ ఇద్దరూ 50 రోజుల పండగపై కన్నేశారు. మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా ఈనెల 29తో 50 […]

యుద్ధం ఇంకా ముగిసిపోలేదు
X

సంక్రాంతి సినిమాలొచ్చి చాన్నాళ్లు గడిచిపోయాయి. ప్రస్తుతం మహేష్, బన్నీ సినిమాలు 5వ వారంలోకి వచ్చేశాయి. మహా అయితే మరో వారం రోజులు. కలెక్షన్ల వివరాలు, పోస్టర్ల హడావుడి కూడా బాగా తగ్గింది. ఇలా అంతా స్తబ్దుగా మారిందని అంతా అనుకుంటున్నారు. కానీ అసలు కథ ముందుంది. సునామీ సైలెంట్ గా వస్తోంది.

అవును.. అటు బన్నీ, ఇటు మహేష్ ఇద్దరూ 50 రోజుల పండగపై కన్నేశారు. మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా ఈనెల 29తో 50 రోజులు పూర్తిచేసుకుంటోంది. అటు అల్లు అర్జున్ చేసిన అల వైకుంఠపురములో సినిమా కూడా మార్చి 1కి 50 రోజులు పూర్తిచేసుకుంటోంది.

50 రోజులు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా భారీ ఫంక్షన్ నిర్వహించాలని భావిస్తున్నాడు నిర్మాత అనీల్ సుంకర్. అక్కడితో ఆగిపోలేదు. ఆ రోజున భారీ ఫిగర్లతో పోస్టర్ రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడట. సరిలేరు మేకర్స్ ఇలాంటి పనేదో చేస్తారని బన్నీ యూనిట్ కు ముందే తెలుసు. అందుకే వాళ్లు కూడా వెయిటింగ్.

మార్చి 1తో 50 రోజులు పూర్తిచేసుకుంటున్న అల వైకుంఠపురములో సినిమాకు సంబంధించి ఫైనల్ కలెక్షన్లు విడుదల చేయాలని ఈ యూనిట్ కూడా అనుకుంటోంది. సరిలేరు లెక్కలొచ్చిన తర్వాత తమ లెక్కల్ని పోస్టర్ రూపంలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే నాన్-బాహుబలి రికార్డు అని ప్రకటించుకున్న అల్లు అర్జున్.. 50వ రోజున ఏం చేస్తాడో చూడాలి.

First Published:  13 Feb 2020 2:30 AM GMT
Next Story