Telugu Global
NEWS

శ్రీరెడ్డి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ చంపేస్తామంటున్నారు.... దర్శకుడి ఫిర్యాదు

తనను శ్రీరెడ్డి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ బెదిరిస్తున్నారని.. ఫోన్లు చేసి చంపేస్తామంటున్నారని దర్శకుడు, కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ బంజారాహిల్స్ పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రాకేష్ మాస్టర్ విలేకరుతో మాట్లాడుతూ తాను 1500 సినిమాలకు కొరియాగ్రాఫర్ గా చేశానని.. ప్రస్తుతం ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నానని తెలిపాడు. గత నెల 29న శ్రీరెడ్డి తనను యూట్యూబ్, ఫేస్ బుక్ లో చంపుతానని బెదిరించిందని.. ఆమె మనుషులతో ఫోన్లు చేయిస్తూ బెదిరిస్తోందని ఆరోపించారు. ఈ ఆధారాల వీడియోలను […]

శ్రీరెడ్డి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ చంపేస్తామంటున్నారు.... దర్శకుడి ఫిర్యాదు
X

తనను శ్రీరెడ్డి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ బెదిరిస్తున్నారని.. ఫోన్లు చేసి చంపేస్తామంటున్నారని దర్శకుడు, కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ బంజారాహిల్స్ పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా రాకేష్ మాస్టర్ విలేకరుతో మాట్లాడుతూ తాను 1500 సినిమాలకు కొరియాగ్రాఫర్ గా చేశానని.. ప్రస్తుతం ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నానని తెలిపాడు. గత నెల 29న శ్రీరెడ్డి తనను యూట్యూబ్, ఫేస్ బుక్ లో చంపుతానని బెదిరించిందని.. ఆమె మనుషులతో ఫోన్లు చేయిస్తూ బెదిరిస్తోందని ఆరోపించారు. ఈ ఆధారాల వీడియోలను పోలీసులకు అందజేశానని తెలిపారు.

ఇక తాను ఎన్టీఆర్ గురించి ఏమీ అనలేదని.. అనని మాటలను అపార్థం చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా తనను చంపేస్తామంటున్నారని.. బెదిరిస్తున్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఓ వైపు ఎన్టీఆర్ ఫ్యాన్స్, మరోవైపు శ్రీరెడ్డి తనను చంపేస్తామంటున్నారని.. తనకు ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలని దర్శకుడు రాకేష్ పోలీసులను కోరాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

రాకేష్ మాస్టర్ గతంలోనూ తన శిష్యుడు, ప్రముఖ కొరియోగ్రాఫర్ అయిన శేఖర్ మాస్టర్ తోనూ గొడవ పెట్టుకున్నాడు. వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడా వ్యాఖ్యలతోనే శ్రీరెడ్డి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైనట్టు తెలుస్తోంది.

First Published:  29 Feb 2020 6:55 AM GMT
Next Story