Telugu Global
NEWS

చిరంజీవితో రఘువీరా... ఇదే ఇప్పుడు పిక్చర్ ఆఫ్ ఆంధ్రా

చిరంజీవి.. కేంద్ర మంత్రిగా పని చేసి.. ఇప్పుడు రాజకీయాలు వదిలి.. తన పని తాను చేసుకుంటున్నారు. హాయిగా సినిమాలు చేసుకుంటూ జీవితాన్ని మునుపటిలా ఎంజాయ్ చేస్తున్నారు. కలర్ ఫుల్ గా లైఫ్ కానిచ్చేస్తున్నారు. రఘువీరారెడ్డి.. రాష్ట్ర మంత్రిగా పని చేశారు. ఏపీకి పీసీసీ చీఫ్ గా పని చేశారు. జాతీయ స్థాయిలోనూ పరిచయాలు, మంచి పేరు తెచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పొసగలేక.. పొలం పనికి మాత్రమే పరిమితమయ్యారు. పల్లెటూరి జీవనాన్ని.. హాయిగా అనుభవిస్తున్నారు. ఆడంబరాలకు దూరంగా ఉంటున్నారు. […]

చిరంజీవితో రఘువీరా... ఇదే ఇప్పుడు పిక్చర్ ఆఫ్ ఆంధ్రా
X

చిరంజీవి.. కేంద్ర మంత్రిగా పని చేసి.. ఇప్పుడు రాజకీయాలు వదిలి.. తన పని తాను చేసుకుంటున్నారు. హాయిగా సినిమాలు చేసుకుంటూ జీవితాన్ని మునుపటిలా ఎంజాయ్ చేస్తున్నారు. కలర్ ఫుల్ గా లైఫ్ కానిచ్చేస్తున్నారు.

రఘువీరారెడ్డి.. రాష్ట్ర మంత్రిగా పని చేశారు. ఏపీకి పీసీసీ చీఫ్ గా పని చేశారు. జాతీయ స్థాయిలోనూ పరిచయాలు, మంచి పేరు తెచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పొసగలేక.. పొలం పనికి మాత్రమే పరిమితమయ్యారు. పల్లెటూరి జీవనాన్ని.. హాయిగా అనుభవిస్తున్నారు. ఆడంబరాలకు దూరంగా ఉంటున్నారు.

ఇలాంటి ఇద్దరు నేతలు.. ఒకే చోట కలిస్తే విశేషమేగా మరి. అవును. అలాంటి సందర్భమే అందరినీ ఆకర్షిస్తోంది. హైదరాబాద్ వెళ్లి మరీ చిరంజీవిని కుటంబసమేతంగా కలిశారు రఘువీరారెడ్డి. తన ఊరు అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం నీలకంఠాపురంలో 52 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు చిరంజీవిని ఆహ్వానించారు. మే 29న కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు.

చిరంజీవి ఆ కార్యక్రమానికి వెళ్తారో లేదో తెలియదు కానీ.. చిరు, రఘువీరా కలయిక మాత్రం.. రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఈ ఇద్దరూ రాజకీయాలు మాట్లాడుకునే అవకాశమైతే లేకుండా ఉండవని.. ఇద్దరి మధ్యా ఈ దిశగా ఏ విషయం చర్చకు వచ్చి ఉంటుందా అని.. అంతా అనుకుంటున్నారు. కలర్ ఫుల్ గా ఉన్న వీరి పిక్చర్ ను కాంగ్రెస్ అభిమానులైతే ఎంజాయ్ చేస్తున్నారు. తమ పార్టీకి ఆంధ్రాలో మళ్లీ మంచి రోజులు రావాలని కోరుకుంటున్నారు.

First Published:  3 March 2020 3:58 AM GMT
Next Story