Telugu Global
NEWS

భారత బాక్సర్లకు 4 ఒలింపిక్స్ బెర్త్ లు

వికాస్, పూజా, లవ్ లీనా, అశీష్ లకు టోక్యో అర్హత టోక్యో ఒలింపిక్స్ కు నలుగురు భారత బాక్సర్లు అర్హత సంపాదించారు. జోర్డాన్ రాజధాని అమ్మాన్ వేదికగా జరుగుతున్న ఆసియా బాక్సింగ్ కమ్ ఒలింపిక్స్ అర్హత పోటీలలో…సెమీస్ కు చేరుకోడం ద్వారా…అమిత్ పంగల్, పూజా రాణీ, లవ్లీన్ బోర్గోహైన్, అశీష్ కుమార్ టోక్యో బెర్త్ లు ఖాయం చేసుకొన్నారు. పురుషుల 69 కిలోల విభాగంలో అమిత్ పంగల్, మహిళల 75 కిలోల విభాగంలో పూజా రాణి, లవ్లీనా, […]

భారత బాక్సర్లకు 4 ఒలింపిక్స్ బెర్త్ లు
X
  • వికాస్, పూజా, లవ్ లీనా, అశీష్ లకు టోక్యో అర్హత

టోక్యో ఒలింపిక్స్ కు నలుగురు భారత బాక్సర్లు అర్హత సంపాదించారు. జోర్డాన్ రాజధాని అమ్మాన్ వేదికగా జరుగుతున్న ఆసియా బాక్సింగ్ కమ్ ఒలింపిక్స్ అర్హత పోటీలలో…సెమీస్ కు చేరుకోడం ద్వారా…అమిత్ పంగల్, పూజా రాణీ, లవ్లీన్ బోర్గోహైన్, అశీష్ కుమార్ టోక్యో బెర్త్ లు ఖాయం చేసుకొన్నారు.

పురుషుల 69 కిలోల విభాగంలో అమిత్ పంగల్, మహిళల 75 కిలోల విభాగంలో పూజా రాణి, లవ్లీనా, 75 కిలోల విభాగంలో అశీష్ క్వార్టర్ ఫైనల్స్ విజయాలు సాధించడం ద్వారా మెడల్ రౌండ్లో ప్రవేశించారు.

ఈ నలుగురూ సెమీస్ లో ఓడినా కాంస్యపతకాలతో సహా ఒలింపిక్స్ కు అర్హత సాధించగలుగుతారు. లవ్లీన్, పూజా రాణి ఒలింపిక్స్ కు తొలిసారిగా అర్హత సంపాదించగా…వికాస్ కృష్ణన్ తన కెరియర్ లో మూడోసారి ఒలింపిక్స్ బెర్త్ సంపాదించడం విశేషం.

భారత స్టార్ బాక్సర్ మేరీ కోమ్ సైతం మహిళల 51 కిలోల విభాగంలో ఒలింపిక్స్ కు అర్హత సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

First Published:  8 March 2020 9:17 PM GMT
Next Story