Telugu Global
National

కరోనా పై పోరుకు మేఘా సైతం... రూ. 5కోట్ల విరాళం

కరోనా వైరస్ పై జరుగుతున్న పోరులో భాగంగా ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ మేఘ ఇంజనీరింగ్ తనవంతు బాధ్యత నిర్వర్తిస్తోంది. సామాజిక బాధ్యతలో భాగంగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి 5 కోట్ల రూపాయలు ఆర్ధిక సహాయం అందించిన మేఘ అధినేత పీవీ కృష్ణారెడ్డి , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి 5 కోట్ల రూపాయల విరాళం అందచేసారు. అందులో భాగంగా తాడేపల్లి లో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని కలిసి కృష్ణారెడ్డి 5 కోట్ల రూపాయల చెక్కు […]

కరోనా పై పోరుకు మేఘా సైతం... రూ. 5కోట్ల విరాళం
X

కరోనా వైరస్ పై జరుగుతున్న పోరులో భాగంగా ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ మేఘ ఇంజనీరింగ్ తనవంతు బాధ్యత నిర్వర్తిస్తోంది.

సామాజిక బాధ్యతలో భాగంగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి 5 కోట్ల రూపాయలు ఆర్ధిక సహాయం అందించిన మేఘ అధినేత పీవీ కృష్ణారెడ్డి , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి 5 కోట్ల రూపాయల విరాళం అందచేసారు. అందులో భాగంగా తాడేపల్లి లో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని కలిసి కృష్ణారెడ్డి 5 కోట్ల రూపాయల చెక్కు అందించారు.

తెలుగు రాష్ట్రాలతో పాటు కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి సహాయనిధికి కూడా 2 కోట్ల రూపాయలు మేఘా ఇంజనీరింగ్ సంస్థ విరాళం అందజేసింది. మేఘా ఇంజనీరింగ్ సంస్థ కర్ణాటక రీజియన్ విభాగం అధిపతి సుధీర్ మోహన్ కర్ణాటక ముఖ్యమంత్రిని కలిసి 2 కోట్ల రూపాయల చెక్కు అందించారు. ఇదే క్రమంలో ఒడిశా ప్రభుత్వానికి మరో కోటి రూపాయల ఆర్ధిక సహాయం అందించింది మేఘ ఇంజనీరింగ్. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని మేఘా సంస్థ ప్రతినిధి రంగరాజన్ కలిసి కోటి రూపాయల చెక్కు అందజేశారు.

త్వరలో మరికొన్ని రాష్ట్రాలకు ఆర్ధిక సహాయం అందజేసేందుకు మేఘా ఇంజనీరింగ్ సంస్థ సిద్దం అవుతోంది.

First Published:  27 March 2020 8:23 AM GMT
Next Story