Telugu Global
Cinema & Entertainment

కరోనా విరాళం.. ఎట్టకేలకు ప్రకటించిన టాలీవుడ్ హీరోయిన్లు

మొత్తానికి ఎట్టకేలకు మన హీరోయిన్లు స్పందించారు. టాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న మన హీరోయిన్లు కరోనా వేళ ఒక్క రూపాయి కూడా విరాళం ఇవ్వని వైనంపై విమర్శలు చెలరేగాయి. దీంతో తెలుగులో నటిస్తున్న టాప్ హీరోయిన్లు తాజాగా తమ విరాళాలను ఇవ్వడం ప్రారంభించారు. తాజాగా కొంతమంది టాలీవుడ్ హీరోయిన్లు రోజువారీ కూలీ, కార్మికులకు విరాళాలు ప్రకటించారు. హీరోయిన్లలో అందరికంటే ముందుగా సినీ కార్మికులకు సహాయం చేయడానికి వచ్చింది ‘బాపు బొమ్మ’ అయిన ప్రణీత సుభాష్. […]

కరోనా విరాళం.. ఎట్టకేలకు ప్రకటించిన టాలీవుడ్ హీరోయిన్లు
X

మొత్తానికి ఎట్టకేలకు మన హీరోయిన్లు స్పందించారు. టాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న మన హీరోయిన్లు కరోనా వేళ ఒక్క రూపాయి కూడా విరాళం ఇవ్వని వైనంపై విమర్శలు చెలరేగాయి.

దీంతో తెలుగులో నటిస్తున్న టాప్ హీరోయిన్లు తాజాగా తమ విరాళాలను ఇవ్వడం ప్రారంభించారు. తాజాగా కొంతమంది టాలీవుడ్ హీరోయిన్లు రోజువారీ కూలీ, కార్మికులకు విరాళాలు ప్రకటించారు.

హీరోయిన్లలో అందరికంటే ముందుగా సినీ కార్మికులకు సహాయం చేయడానికి వచ్చింది ‘బాపు బొమ్మ’ అయిన ప్రణీత సుభాష్. ఈమె ఒక లక్ష రూపాయలను సినీ కార్మికుల సహాయార్ధం విరాళం ఇచ్చింది. ఇక అదే బాటలో లావణ్య త్రిపాఠి కూడా సాయం చేసింది.

తమిళ నటి ఐశ్వర్య రాజేశ్ తమిళనాడు సీఎం సహాయనిధికి విరాళం అందజేసింది. దక్షిణ భారత సినీ కార్మికులకు నయనతార రూ.20 లక్షల సాయం ప్రకటించారు.

ఇక మన తెలుగులో అగ్రహీరోయిన్లు కాజల్ అగర్వాల్ 2 లక్షలు, తమన్నా రూ.3 లక్షల రూపాయలను సినీ కార్మికులకు విరాళంగా అందజేశారు.

ఇలా చాలా విమర్శలు వచ్చాక కానీ హీరోయిన్లు బయటకు రాలేదు. తాజాగా మౌనం వీడి సాయం చేశారు. ఇక తెలుగులో టాప్ హీరోయిన్లుగా ఉన్న రష్మిక మందన్నా, పూజాహెగ్డే, రాశిఖన్నాలు ఇంకా సాయం చేయాల్సి ఉంది. వారెప్పుడు మౌనం వీడుతారో చూడాలి.

First Published:  20 April 2020 12:16 AM GMT
Next Story