Telugu Global
Cinema & Entertainment

మహేష్ కోసం నమ్రత ఆరాటం.... ఫలితం ఇచ్చేనా ?

లాక్ డౌన్ కారణంగా సినీ పరిశ్రమ ఒక ఏడాది వరకు ఏ ప్రాజెక్టును చేపట్టే యోచనలో లేకుండా పోయింది. ఖాళీగా ఉన్న త్రివిక్రమ్ తన తదుపరి చిత్రాన్ని ఎన్టీఆర్ తో తీయడానికి రెడీ అయ్యాడు. అప్పటివరకు మరో సినిమా ఏదీ తీయకూడదని నిర్ణయించుకున్నాడట. ఎలాగూ సినిమాలు ఆడే పరిస్థితి లేకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇక లాక్ డౌన్ తో ‘ఆర్ఆర్ఆర్’ కూడా వచ్చే సంవత్సరం వేసవికి వాయిదా పడింది. ఆర్ఆర్ఆర్ వాయిదాతో ఎన్టీఆర్ లాక్ […]

మహేష్ కోసం నమ్రత ఆరాటం.... ఫలితం ఇచ్చేనా ?
X

లాక్ డౌన్ కారణంగా సినీ పరిశ్రమ ఒక ఏడాది వరకు ఏ ప్రాజెక్టును చేపట్టే యోచనలో లేకుండా పోయింది. ఖాళీగా ఉన్న త్రివిక్రమ్ తన తదుపరి చిత్రాన్ని ఎన్టీఆర్ తో తీయడానికి రెడీ అయ్యాడు. అప్పటివరకు మరో సినిమా ఏదీ తీయకూడదని నిర్ణయించుకున్నాడట. ఎలాగూ సినిమాలు ఆడే పరిస్థితి లేకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడు.

ఇక లాక్ డౌన్ తో ‘ఆర్ఆర్ఆర్’ కూడా వచ్చే సంవత్సరం వేసవికి వాయిదా పడింది. ఆర్ఆర్ఆర్ వాయిదాతో ఎన్టీఆర్ లాక్ అయిపోయాడు. ఆ తరువాతే త్రివిక్రమ్ మూవీ ఉండనుంది.

ఇక ఆర్ఆర్ఆర్ తర్వాత మహేష్ బాబుతో రాజమౌళి సినిమా చేస్తాడు. దీంతో ఆయన కోసం మరో సినిమాను అంగీకరించే పరిస్థితి లేదు. ఇక ప్రస్తుతం లాక్ డౌన్ ముగిశాక పరుశురాంతో మహేష్ సినిమా చేస్తాడు. ఈ గ్యాప్ లో అతడితో సినిమా చేసి… ఆ తర్వాత రాజమౌళి కోసం మహేష్ ఖాళీగా ఉండాల్సిందే.

అయితే ఈ గ్యాప్ లో మహేష్ తో త్రివిక్రమ్ సినిమా చేయడానికి ప్లాన్లు జరుగుతున్నా వర్కవుట్ కావడం లేదు. ఎన్టీఆర్ తోనే సినిమా చేసేందుకు త్రివిక్రమ్ కట్టుబడి ఉన్నాడు. త్రివిక్రమ్ తో సినిమాకు మహేష్ భార్య నమ్రత చాలా ప్రయత్నాలు చేస్తోందట.. వీరిద్దరినీ కలపడానికి ప్రయత్నిస్తోందట.

త్రివిక్రమ్ తాజాగా ‘అల వైకుంఠపురం’తో ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు. త్రివిక్రమ్, మహేష్ కలిస్తే మరో భారీ హిట్ రావడం ఖాయం అని అనుకుంటున్నారు. రాజమౌళితో, త్రివిక్రమ్ తో సినిమా చేస్తే మహేష్ ఇమేజ్ కూడా పెరుగుతుంది. అందుకే నమ్రత తాజాగా మహేష్-త్రివిక్రమ్ లను కలపడానికి నమత్ర తెగ ప్రయత్నాలు చేస్తోందట.

First Published:  27 April 2020 3:24 AM GMT
Next Story