Telugu Global
Cinema & Entertainment

మహాసముద్రంలో మరో హీరో?

ఆర్ఎక్స్100 సక్సెస్ తర్వాత పూర్తిగా మహాసముద్రం ప్రాజెక్టుకే పరిమితమైపోయాడు దర్శకుడు అజయ్ భూపతి. అయితే ఏ హీరోకు కథ చెప్పినా అతడికి పని జరగలేదు. అలా దాదాపు ఏడాదిగా నలుగుతున్న ఈ ప్రాజెక్టు ఇప్పుడిప్పుడే ఓ కొలిక్కి వచ్చేలా కనిపిస్తోంది. మల్టీస్టారర్ కాన్సెప్ట్ తో రాబోతున్న మహాసముద్రంలో హీరోలు ఆల్ మోస్ట్ ఫిక్స్ అయ్యారు. ఈ సినిమాలో ఒక హీరోగా నటించడానికి శర్వానంద్ ఆల్రెడీ అంగీకరించాడు. ఇదే విషయాన్ని దర్శకుడు ఈమధ్య ప్రకటించాడు. ఇక మరో హీరోగా […]

మహాసముద్రంలో మరో హీరో?
X

ఆర్ఎక్స్100 సక్సెస్ తర్వాత పూర్తిగా మహాసముద్రం ప్రాజెక్టుకే పరిమితమైపోయాడు దర్శకుడు అజయ్ భూపతి. అయితే ఏ హీరోకు కథ చెప్పినా అతడికి పని జరగలేదు. అలా దాదాపు ఏడాదిగా నలుగుతున్న ఈ ప్రాజెక్టు ఇప్పుడిప్పుడే ఓ కొలిక్కి వచ్చేలా కనిపిస్తోంది. మల్టీస్టారర్ కాన్సెప్ట్ తో రాబోతున్న మహాసముద్రంలో హీరోలు ఆల్ మోస్ట్ ఫిక్స్ అయ్యారు.

ఈ సినిమాలో ఒక హీరోగా నటించడానికి శర్వానంద్ ఆల్రెడీ అంగీకరించాడు. ఇదే విషయాన్ని దర్శకుడు ఈమధ్య ప్రకటించాడు. ఇక మరో హీరోగా సిద్దార్థ్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నారు. లాక్ డౌన్ కంటే ముందే దర్శకుడు-సిద్దార్థ్ మధ్య స్టోరీ డిస్కషన్స్ జరిగాయి. నటించడానికి సిద్ధూ దాదాపు ఒప్పుకున్నాడు.

సిద్ధూ ఎంట్రీని లాక్ డౌన్ తర్వాత అధికారికంగా ప్రకటించబోతున్నారు. వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో కంప్లీట్ యాక్షన్ ఎలిమెంట్స్ తో రాబోతోంది మహాసముద్రం. ముందుగా ఈ సినిమాను నాగచైతన్యతో అనుకున్నాడు దర్శకుడు, తర్వాత రవితేజను కూడా సంప్రదించాడు. చివరికి శర్వానంద్ దగ్గరకొచ్చి అగింది. ఇప్పుడు సిద్దార్థ్ రాకతో ప్రాజెక్ట్ ఓ కొలిక్కి వచ్చింది. ఆనంది ఆర్ట్స్ బ్యానర్ పై జెమినీ కిరణ్ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు.

First Published:  29 April 2020 8:00 AM GMT
Next Story