Telugu Global
National

విశాఖ నుంచి స్టెరిన్‌ను తరలించండి " సీఎం జగన్‌ ఆదేశం

విశాఖపట్టణం నుంచి స్టెరిన్‌ కెమికల్‌ను తరలించాలని సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇంతటి ప్రమాదానికి కారణమైన స్టెరిన్‌ రసాయనాన్ని విశాఖపట్నంలో ఉంచడానికి వీల్లేదని స్పష్టంచేశారు. వివిధ ట్యాంకుల్లో, ఇతరత్రా చోట్ల ఉన్న స్టెరిన్‌ రసాయనాన్ని వెనక్కి పంపాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని ఈ పని పూర్తిచేయాలని అధికారులకు చెప్పారు. విశాఖపట్నంలో గ్యాస్‌ లీక్‌ దుర్ఘటనపై ఆదివారం సాయంత్రం సీఎం మరోసారి సమీక్ష జరిపారు. గ్యాస్‌ బాధితులు ఇళ్లకు చేరుకునేలా పరిస్థితులను మెరుగుపరచాలని […]

విశాఖ నుంచి స్టెరిన్‌ను తరలించండి  సీఎం జగన్‌ ఆదేశం
X

విశాఖపట్టణం నుంచి స్టెరిన్‌ కెమికల్‌ను తరలించాలని సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇంతటి ప్రమాదానికి కారణమైన స్టెరిన్‌ రసాయనాన్ని విశాఖపట్నంలో ఉంచడానికి వీల్లేదని స్పష్టంచేశారు. వివిధ ట్యాంకుల్లో, ఇతరత్రా చోట్ల ఉన్న స్టెరిన్‌ రసాయనాన్ని వెనక్కి పంపాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని ఈ పని పూర్తిచేయాలని అధికారులకు చెప్పారు.

విశాఖపట్నంలో గ్యాస్‌ లీక్‌ దుర్ఘటనపై ఆదివారం సాయంత్రం సీఎం మరోసారి సమీక్ష జరిపారు. గ్యాస్‌ బాధితులు ఇళ్లకు చేరుకునేలా పరిస్థితులను మెరుగుపరచాలని అన్నారు. సోమవారం ఉదయం నుంచి ప్రభావిత గ్రామాల్లో ఇంటా, బయటా కూడా పూర్తిస్థాయిలో రసాయనాల అవశేషాలు లేకుండా శానిటేషన్‌ కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. సాయంత్రానికి ప్రజలు ఇళ్లకు చేరేలా చూడాలని సీఎం కోరారు. ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చేందుకు మంత్రులు ఆయా గ్రామాల్లో రాత్రి బస చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

ఆస్పత్రిలో వైద్యం తీసుకుని, డిశ్చార్జి అవుతున్న ప్రజలు తిరిగి ఇళ్లకు చేరేంతవరకూ అధికారులు, ప్రజా ప్రతినిధులు బాధ్యత తీసుకోవాలని సీఎం జగన్‌ అన్నారు. వారికి మంచి సదుపాయాలు అందేలా చూడాలని, తర్వాత కూడా వారికి వైద్య సేవల విషయంలో ఎలాంటి లోటుపాట్లు రాకుండా చూడాలని చెప్పారు.

సోమవారం ఉదయం మంత్రులు, అధికారులు కలిసి మరణించిన వారి కుటుంబాలకు ప్రకటించిన ఎక్స్‌గ్రేషియాను ఇవ్వాలని సూచించారు. మిగతావారికి ఆర్ధిక సాయం గ్రామ వాలంటీర్ల ద్వారా డోర్‌డెలివరీ చేయాలని చెప్పారు. పారదర్శకంగా, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని చేపట్టాలని అన్నారు. గ్యాస్‌ ప్రభావిత గ్రామాల్లో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని నిపుణులు చెప్పిన విషయాన్ని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు.

First Published:  10 May 2020 8:54 PM GMT
Next Story