Telugu Global
National

60వేల కోట్ల పెండింగ్‌ బిల్లుల సునామీని అధిగమించి సాగాం... బడ్జెట్‌లో హైలైట్స్

2లక్షల 24 వేల 789 కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్‌ వార్షిక బడ్జెట్‌ను… ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈసారి సంక్షేమానికి పెద్ద పీట వేశారు. మండలిలో బడ్జెట్‌ను మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రవేశపెట్టారు. గంటన్నర పాటు బుగ్గన బడ్జెట్ ప్రసంగం సాగింది. జూన్ 2019లో వైసీపీ అధికారం అందుకున్నప్పటికే రాష్ట్రంలో పరిష్కరించాల్సిన ఎన్నో సమస్యలు, అడ్డంకులు ప్రభుత్వం ముందు నిలిచాయని తన ప్రసంగంలో బుగ్గన వివరించారు. గత ప్రభుత్వం మోపిన భారం […]

60వేల కోట్ల పెండింగ్‌ బిల్లుల సునామీని అధిగమించి సాగాం... బడ్జెట్‌లో హైలైట్స్
X

2లక్షల 24 వేల 789 కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్‌ వార్షిక బడ్జెట్‌ను… ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈసారి సంక్షేమానికి పెద్ద పీట వేశారు. మండలిలో బడ్జెట్‌ను మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రవేశపెట్టారు. గంటన్నర పాటు బుగ్గన బడ్జెట్ ప్రసంగం సాగింది. జూన్ 2019లో వైసీపీ అధికారం అందుకున్నప్పటికే రాష్ట్రంలో పరిష్కరించాల్సిన ఎన్నో సమస్యలు, అడ్డంకులు ప్రభుత్వం ముందు నిలిచాయని తన ప్రసంగంలో బుగ్గన వివరించారు.

గత ప్రభుత్వం మోపిన భారం వల్ల ఈ ప్రభుత్వం ఎన్నో పెను సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. 2018-19లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి కేవలం 8.8 శాతం మాత్రమే పెరిగిందన్నారు. అప్పటికే గత ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంటున్న రెండంకెల వార్షిక ప్రగతి అవాస్తవమని తేలిందన్నారు. గత ప్రభుత్వం వదిలిపెట్టిన 60వేల కోట్ల పెండింగ్‌ బిల్లుల భారం సునామీలా తమ ప్రభుత్వంపై తొలి ఏడాదిలో విరుచుకుపడిందన్నారు. ఆ పరిస్థితిని అధిగమించి ముందుకు సాగుతున్నామని చెప్పారు.

2020-21లో ప్రధాన అంశాలు, కేటాయింపు…

  • రూ.2,24,789.18 కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్‌
  • రెవెన్యూ వ్యయం అంచనా రూ.1,80,392.65 కోట్లు
  • మూలధన వ్యయం అంచనా రూ.44,396.54 కోట్లు

వివిధ రంగాల వారీగా బడ్జెట్‌ కేటాయింపులు

  • వ్యవసాయ రంగానికి రూ. 11,891 కోట్లు
  • ఆరోగ్య రంగానికి రూ.11,419.44 కోట్లు
  • పశుగణాభివృద్ధి, మత్స్యరంగానికి రూ.1279.78 కోట్లు
  • గృహ నిర్మాణ రంగానికి రూ.3,691.79 కోట్లు
  • హోంశాఖకు రూ.5,988.72 కోట్లు
  • జలవనరుల శాఖకు రూ. 11,805.74 కోట్లు
  • పెట్టుబడులు, మౌలిక వసతుల రంగానికి రూ.696.62 కోట్లు
  • ఐటీ రంగానికి రూ. 197.37 కోట్లు
  • కార్మిక సంక్షేమానికి రూ. 601.37 కోట్లు
  • పంచాయతీరాజ్, రూరల్‌ డెవలప్‌మెంట్‌కు రూ. 16710.34 కోట్లు
  • న్యాయశాఖకు రూ. 913.76 కోట్లు
  • మున్సిపల్‌ పట్టణాభివృద్ధి శాఖలకు రూ. 8150.24 కోట్లు
  • స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు రూ. 856.64 కోట్లు
  • పౌరసరఫరాల శాఖకు రూ. 3,520.85 కోట్లు
  • ఆర్థిక రంగానికి రూ. 50,703 కోట్లు
  • విద్యుత్‌ రంగానికి రూ. 6,984.72 కోట్లు
  • ప్రాథమిక ఉన్నత విద్యకు రూ. 22,604.01 కోట్లు
  • సోషల్‌ వెల్ఫేర్‌ కోసం రూ.12,465.85 కోట్లు
  • ట్రాన్స్‌పోర్టు, ఆర్‌అండ్‌బీ కోసం రూ.6,588.58 కోట్లు
  • మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల కోసం రూ.3456.02 కోట్లు
  • మైనార్టీ సంక్షేమానికి రూ.2,055.63 కోట్లు
  • ప్రణాళిక రంగానికి రూ.515.87 కోట్లు
  • పర్యావరణం, అటవీశాఖకు రూ.457.32 కోట్లు
  • సాధారణ పరిపాలనకు రూ.878.01 కోట్లు
  • ఎస్సీల సంక్షేమానికి రూ.15,735 కోట్లు
  • గిరిజనుల సంక్షేమానికి రూ.5,177.54 కోట్లు
  • కాపుల సంక్షేమానికి రూ.2,846.47 కోట్లు
  • ఎస్సీ, ఎస్టీ గృహాల ఉచిత విద్యుత్‌కు రూ.425.93 కోట్లు
  • 104, 108 వాహన సేవలకు రూ.470.29 కోట్లు
  • గ్రామీణాభివృద్ధికి రూ.16,710 కోట్లు
  • సాగునీటి పారుదల శాఖకు రూ.11,805 కోట్లు
  • రవాణా రంగానికి రూ.6,588 కోట్లు
  • డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కోసం రూ. 2100 కోట్లు
  • నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ కోసం రూ. 1808.03 కోట్లు

వివిధ పథకాలు, మౌలిక వసుతుల కోసం బడ్జెట్‌ కేటాయింపులు

  • వైఎస్సార్‌ లా నేస్తం కోసం రూ. 12. 75 కోట్లు
  • రైతులకు విత్తనాల పంపిణీ కోసం రూ.200 కోట్లు
  • జగనన్న విద్యాకానుక కోసం రూ.500 కోట్లు
  • ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్‌ మీడియం కోసం రూ. 55.15 కోట్లు
  • కొత్త రాజధానిలో మౌలిక వసతుల కోసం రూ. 500 కోట్లు
  • ప్రతిభ స్కాలర్‌షిప్స్‌ కోసం రూ. 10.54 కోట్లు
  • నేషనల్‌ హార్టీకల్చర్‌ మిషన్‌ రూ. 150.99 కోట్లు
  • పట్టణ స్వయం సహాయక బృందాల కోసం రూ. 389.89 కోట్లు
  • రైతులకిచ్చే నష్ట పరిహారం కోసం రూ. 20 కోట్లు
  • గ్రామ సచివాలయాల కోసం రూ. 1633 కోట్లు
  • అమరావతి-అనంతపురం నేషనల్‌ హైవే కోసం రూ. 100 కోట్లు
  • వైఎస్సార్‌ గృహ వసతి కోసం రూ. 3 వేల కోట్లు
  • డ్రగ్స్‌, మందుల కేంద్రీకృత కొనుగోళ్ల కోసం రూ. 400 కోట్లు
  • కుటుంబ సంక్షేమ కేంద్రాల కోసం రూ. 242.15 కోట్లు
  • వ్యవసాయ మార్కెట్ల మౌలిక సదుపాయాల నిధి రూ. 100 కోట్లు
  • అగ్రిగోల్డ్‌ బాధితులకు రూ.200 కోట్లు
  • వైఎస్సార్‌‌ సంపూర్ణ పౌషణ పథకానికి రూ.1500 కోట్లు
  • డ్వాక్రా మహిళల సున్నా వడ్డీ పథకానికి రూ.1365.08 కోట్లు
  • వైఎస్సార్‌ పెన్షన్‌ కానుకకు రూ.16వేల కోట్లు
  • జగనన్న అమ్మఒడి పథకానికి రూ.6వేల కోట్లు
  • వైఎస్సార్‌ చేయూత పథకానికి రూ.3వేల కోట్లు
  • వైఎస్సార్‌ ఆసరా పథకానికి రూ.6,300 కోట్లు
  • వైఎస్సార్ వాహనమిత్ర పథకానికి రూ.275.52 కోట్లు
  • వైఎస్సార్ నేతన్ననేస్తం పథకానికి రూ.200 కోట్లు
  • జగనన్న తోడు పథకానికి రూ.930 కోట్లు
  • జగనన్న చేదోడు పథకానికి రూ.247 కోట్లు
  • గ్రామ,వార్డు సచివాలయ వాలంటీర్ల వ్యవస్థకు రూ.46.46 కోట్లు
  • రియల్‌ టైం గవర్నెన్స్‌ కోసం రూ.54.51 కోట్లు
  • వ్యవసాయ ల్యాబ్‌లకు రూ.65 కోట్లు
  • వైఎస్‌ఆర్‌ రైతుభరోసా – పీఎం కిసాన్‌కు రూ.3,615.60 కోట్లు
  • డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ పంటల ఉచిత బీమా పథకానికి రూ.500 కోట్లు
  • జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనలో ఉన్నత విద్యకు రూ.2,277 కోట్లు
  • డాక్టర్‌ వైఎస్సార్‌‌ పంటల ఉచిత బీమా పథకానికి రూ.500 కోట్లు
  • వడ్డీలేని రుణాల కోసం రూ.1100 కోట్లు
  • 2018-19లో స్థూల ఉత్పత్తి 8 శాతమే పెరిగింది
First Published:  16 Jun 2020 4:46 AM GMT
Next Story