Telugu Global
Cinema & Entertainment

మహేష్ కు హీరోయిన్ ఫిక్స్

మహేష్ కొత్త సినిమా సర్కారువారి పాట సినిమాకు హీరోయిన్ ఫిక్స్ అయింది. పరశురామ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తిసురేష్ ను హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. మహేష్-కీర్తి కాంబినేషన్ లో ఇదే తొలి సినిమా కాగా.. అజ్ఞాతవాసి తర్వాత కీర్తి అందుకున్న బిగ్ ప్రాజెక్ట్ కూడా ఇదే. ఈ సినిమాలో హీరోయిన్ కోసం చాలా పోటీ నడిచింది. రాశిఖన్నా లాంటి హీరోయిన్లు ముందుగానే ఎలిమినేట్ అవ్వగా.. ఫైనల్ గా పూజాహెగ్డే, కియరా అద్వానీలో […]

మహేష్ కు హీరోయిన్ ఫిక్స్
X

మహేష్ కొత్త సినిమా సర్కారువారి పాట సినిమాకు హీరోయిన్ ఫిక్స్ అయింది. పరశురామ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తిసురేష్ ను హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. మహేష్-కీర్తి కాంబినేషన్ లో ఇదే తొలి సినిమా కాగా.. అజ్ఞాతవాసి తర్వాత కీర్తి అందుకున్న బిగ్ ప్రాజెక్ట్ కూడా ఇదే.

ఈ సినిమాలో హీరోయిన్ కోసం చాలా పోటీ నడిచింది. రాశిఖన్నా లాంటి హీరోయిన్లు ముందుగానే ఎలిమినేట్ అవ్వగా.. ఫైనల్ గా పూజాహెగ్డే, కియరా అద్వానీలో ఒకర్ని తీసుకోవాలని అనుకున్నారు. అయితే ఊహించని విధంగా కీర్తిసురేష్ తెరపైకి రావడం, ఆమెను వెంటనే ఫిక్స్ చేయడం చకచకా జరిగిపోయాయి.

తెలుగులో మహానటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది కీర్తిసురేష్. ఆ మూవీ తర్వాత ఇక స్టార్ హీరోల సరసన కమర్షియల్ హీరోయిన్ గా ఆమె కనిపించదని అంతా అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే కీర్తిసురేష్ కూడా పెంగ్విన్, మిస్ ఇండియా లాంటి ఫిమేల్ ఓరియంటెడ్ కథల్ని సెలక్ట్ చేసుకుంటూ వచ్చింది.

కానీ రీసెంట్ గా కీర్తి మైండ్ సెట్ మారింది. ఓవైపు కథాబలం ఉన్న సినిమాలు చేస్తూనే మరోవైపు కమర్షియల్ హీరోయిన్ గా కూడా కనిపించాలని ఫిక్స్ అయింది. అందుకే కష్టమ్మీద బరువు కూడా తగ్గింది. ఆమె కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం దక్కింది. ఏకంగా మహేష్ మూవీలో నటించే ఛాన్స్ అందుకుంది.

First Published:  20 Jun 2020 3:00 AM GMT
Next Story