Telugu Global
Cinema & Entertainment

కరోనా వార్తల పై క్లారిటీ వచ్చింది...

కోలీవుడ్ ను షాక్ కు గురిచేసిన వార్త ఇది. టోటల్ సౌత్ అంతా అవాక్కయింది ఇది విని. అవును.. హీరోయిన్ నయనతారకు కరోనా సోకిందని, టెస్టుల్లో పాజిటివ్ వచ్చిందంటూ ఈరోజు ఉదయం నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో నిజం లేదు. కేవలం పుకారు మాత్రమే. నయనతార మేనేజర్లు, పీఆర్వోలు ఈ విషయాన్ని ఖండించారు. లాక్ డౌన్ నుంచి నయనతార పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారని, భౌతిక దూరాన్ని పూర్తిగా పాటిస్తున్నారని తెలిపిన ఆమె పీఆర్వోలు.. తను ఇంటికి […]

కరోనా వార్తల పై  క్లారిటీ వచ్చింది...
X

కోలీవుడ్ ను షాక్ కు గురిచేసిన వార్త ఇది. టోటల్ సౌత్ అంతా అవాక్కయింది ఇది విని. అవును.. హీరోయిన్ నయనతారకు కరోనా సోకిందని, టెస్టుల్లో పాజిటివ్ వచ్చిందంటూ ఈరోజు ఉదయం నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో నిజం లేదు. కేవలం పుకారు మాత్రమే. నయనతార మేనేజర్లు, పీఆర్వోలు ఈ విషయాన్ని ఖండించారు.

లాక్ డౌన్ నుంచి నయనతార పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారని, భౌతిక దూరాన్ని పూర్తిగా పాటిస్తున్నారని తెలిపిన ఆమె పీఆర్వోలు.. తను ఇంటికి పరిమితమవ్వడమే కాకుండా.. కుటుంబ సభ్యుల్ని కూడా బయటకు వెళ్లనీయలేదని.. కాబట్టి ఆమెకు కరోనా సోకిందనే వార్తలో ఎలాంటి నిజం లేదంటున్నారు వాళ్లు. పైగా లాక్ డౌన్ మొదలైనప్పట్నుంచి పనిమనుషులకు కూడా నయనతార సెలవులు ఇచ్చేసిందట.

పీఆర్ టీమ్ ఇచ్చిన క్లారిటీతో నయన్ పై వచ్చిన పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. నయనతారతో పాటు ఆమె ప్రియుడు విఘ్నేష్ శివన్ కు కూడా కరోనా సోకిందంటూ వార్తలు రావడం. దీనిపై కూడా నయనతార మేనేజర్లే క్లారిటీ ఇచ్చారు. విఘ్నేష్ కూడా సేఫ్ గానే ఉన్నాడని ప్రకటించారు.

రేపోమాపో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోవాలని రెడీ అవుతున్నారు. అంతలోనే ఈ పుకార్లు ఇలా రావడం నయన్-విఘ్నేష్ ను ఇబ్బందిపెడుతోంది.

First Published:  21 Jun 2020 7:19 AM GMT
Next Story