Telugu Global
Cinema & Entertainment

ఈసారి కంగనాపై కన్నేశారు

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై ఇప్పటికే ముంబయి పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. బాలీవుడ్ కు చెందిన దాదాపు 30 మంది ప్రముఖుల వాంగ్మూలాలు రికార్డు చేశారు. ఇప్పుడీ లిస్ట్ లోకి కంగనా రనౌత్ కూడా చేరింది. త్వరలోనే కంగనాను కూడా విచారించబోతున్నారు పోలీసులు. సుశాంత్ సింగ్ మరణంపై ఎక్కువగా ఆందోళన చేసిన మొదటి వ్యక్తి కంగనా. బాలీవుడ్ కు చెందిన కొంతమంది వ్యక్తులు, సుశాంత్ కు అవకాశాలు రాకుండా చేశారని, అతడు మరణించేలా వ్యవహరించారని […]

ఈసారి కంగనాపై కన్నేశారు
X

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై ఇప్పటికే ముంబయి పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. బాలీవుడ్ కు చెందిన దాదాపు 30 మంది ప్రముఖుల వాంగ్మూలాలు రికార్డు చేశారు. ఇప్పుడీ లిస్ట్ లోకి కంగనా రనౌత్ కూడా చేరింది. త్వరలోనే కంగనాను కూడా విచారించబోతున్నారు పోలీసులు.

సుశాంత్ సింగ్ మరణంపై ఎక్కువగా ఆందోళన చేసిన మొదటి వ్యక్తి కంగనా. బాలీవుడ్ కు చెందిన కొంతమంది వ్యక్తులు, సుశాంత్ కు అవకాశాలు రాకుండా చేశారని, అతడు మరణించేలా వ్యవహరించారని ఆరోపించింది కంగన. అక్కడితో ఆగకుండా కొంతమంది వ్యక్తుల పేర్లు కూడా ప్రస్తావించింది.

దీంతో ఆటోమేటిగ్గా పోలీసుల దృష్టి ఆమెపై పడింది. విచారణకు రావాల్సిందిగా ఆమెకు నోటీసులు పంపించారు. అయితే కంగనా ప్రస్తుతం ముంబయిలో లేదు. లాక్ డౌన్ టైమ్ లో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి మనాలి వెళ్లింది. ఇప్పుడు అక్కడే ఉంది.

కంగనా తిరిగి ముంబయి వచ్చేవరకు పోలీసులు ఎదురుచూస్తారా లేక ఓ బృందం మనాలీ వెళ్లి కంగనా వాయిస్ ను రికార్డ్ చేస్తుందా లేక వాట్సాప్, స్కైప్ లాంటి డిజిటల్ మాధ్యమాల ద్వారా కంగనా వెర్షన్ ను నమోదు చేస్తారా అనేది తేలాల్సి ఉంది. మొత్తమ్మీద ఈ కేసులో కంగనా వాదనలు కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

First Published:  24 July 2020 8:30 PM GMT
Next Story