Telugu Global
Cinema & Entertainment

కరోనా పుకార్లు... కేసు పెట్టిన మాళవిక

గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు కరోనా సోకిందని తెలిసిన తర్వాత ఓ వాట్సాప్ మెసేజ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. రామోజీ ఫిలింసిటీలో జరిగిన ఓ పాటల కార్యక్రమానికి.. పాజిటివ్ అని తెలిసి కూడా సింగర్ మాళవిక హాజరైందని, అందువల్లనే బాలుకు కరోనా సోకిందనేది ఆ వాట్సాప్ మెసేజ్ సారాంశం. దీనిపై గాయని మాళవిక సీరియస్ అయింది. ఆ వాట్సాప్ పోస్ట్ పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు స్పష్టంచేసిన మాళవిక.. తన వల్ల కరోనా […]

కరోనా పుకార్లు... కేసు పెట్టిన మాళవిక
X

గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు కరోనా సోకిందని తెలిసిన తర్వాత ఓ వాట్సాప్ మెసేజ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. రామోజీ ఫిలింసిటీలో జరిగిన ఓ పాటల కార్యక్రమానికి.. పాజిటివ్ అని తెలిసి కూడా సింగర్ మాళవిక హాజరైందని, అందువల్లనే బాలుకు కరోనా సోకిందనేది ఆ వాట్సాప్ మెసేజ్ సారాంశం.

దీనిపై గాయని మాళవిక సీరియస్ అయింది. ఆ వాట్సాప్ పోస్ట్ పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు స్పష్టంచేసిన మాళవిక.. తన వల్ల కరోనా సోకే అవకాశమే లేదంటూ తన వాదన వినిపించింది. ఈ మేరకు ఓ వీడియో కూడా రిలీజ్ చేసింది.

జులై 30, 31 తేదీల్లో రామోజీ ఫిలింసిటీలో పాటల కార్యక్రమం జరిగిందట. ఆ కార్యక్రమానికి 4 నెలల ముందువరకు మాళవిక ఇంటి గడప దాటి కాలు బయటపెట్టలేదట. కేవలం ఈ కార్యక్రమం కోసమే ఫస్ట్ టైమ్ ఇంట్లోంచి బయటకొచ్చిందట. అలాంటప్పుడు తన వల్ల బాలుగారికి ఎలా కరోనా వస్తుందంటూ ప్రశ్నిస్తోంది మాళవిక.

అంతేకాదు.. ఆ కార్యక్రమం తర్వాత ఇంట్లో తన తల్లిదండ్రులకు, పాపకు కూడా కరోనా సోకిందని ఆవేదన వ్యక్తంచేసింది. ఇకపైనైనా తనపై జరుగుతున్న ఈ దుష్ప్రచారాన్ని ఆపాలని మాళవిక కోరుతోంది.

First Published:  21 Aug 2020 2:43 AM GMT
Next Story