Telugu Global
National

మాస్క్‌ పెడితే గుర్తు పట్టలేరనుకున్నారేమో!...

ఏపీలో కొందరు ఇప్పటికీ చంద్రబాబునాయుడే ముఖ్యమంత్రిగా ఉన్నట్టు భావిస్తున్నారు. చంద్రబాబుతో ఉంటే ఎవరూ ఏమీ చేయలేరన్న ధీమాతో ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులై ఉండి కూడా టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా… ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తుంటే వంతపాడుతున్నారు. అలాంటి ఉపాధ్యాయుడు ఒకరు ఇప్పుడు బుక్ అయ్యారు. రమేష్ ఆస్పత్రి యాజమాన్యాన్ని వెనుకేసుకొచ్చేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్న టీడీపీ ఇందులో భాగంగా ఇటీవల బాబు రాజేంద్రప్రసాద్ చేత టీడీపీ కార్యాలయంలో ప్రెస్‌మీట్ పెట్టించింది. ఆ ప్రెస్‌మీట్‌లో బాబు రాజేంద్రప్రసాద్… కమ్మవారిపై కక్ష సాధిస్తోందని […]

మాస్క్‌ పెడితే గుర్తు పట్టలేరనుకున్నారేమో!...
X

ఏపీలో కొందరు ఇప్పటికీ చంద్రబాబునాయుడే ముఖ్యమంత్రిగా ఉన్నట్టు భావిస్తున్నారు. చంద్రబాబుతో ఉంటే ఎవరూ ఏమీ చేయలేరన్న ధీమాతో ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులై ఉండి కూడా టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా… ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తుంటే వంతపాడుతున్నారు. అలాంటి ఉపాధ్యాయుడు ఒకరు ఇప్పుడు బుక్ అయ్యారు.

రమేష్ ఆస్పత్రి యాజమాన్యాన్ని వెనుకేసుకొచ్చేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్న టీడీపీ ఇందులో భాగంగా ఇటీవల బాబు రాజేంద్రప్రసాద్ చేత టీడీపీ కార్యాలయంలో ప్రెస్‌మీట్ పెట్టించింది. ఆ ప్రెస్‌మీట్‌లో బాబు రాజేంద్రప్రసాద్… కమ్మవారిపై కక్ష సాధిస్తోందని ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

కమ్మ కులంలో పుట్టాలని మేము దేవుడిని కోరుకున్నామా? అని ప్రశ్నించారు. కమ్మ కులంలో పుట్టినందుకు బానిసలుగా బతకాలా? అని ప్రశ్నించారు.

రాజేంద్రప్రసాద్ అలా మాట్లాడుతున్న సమయంలో ఆయనకు మద్దతుగా పక్కనే కూర్చున్న వ్యక్తి ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు. అయినప్పటికీ ఇలా ఒక పార్టీ కార్యాలయంలో, ఒక పార్టీ రాజకీయ నాయకులు పెట్టే ప్రెస్‌మీట్లో కూర్చున్నారు. మాస్క్ పెట్టుకుంటే ఎవరూ గుర్తు పట్టలేరనుకున్నారో ఏమో!. ఈ విషయాన్ని కొందరు నెటిజన్లు గుర్తించేశారు. ప్రభుత్వ టీచర్‌ వెంకటశ్వరరావు టీడీపీ నేతలతో కలిసి ప్రెస్‌మీట్‌లో కూర్చున్నా ఏమీ చేయలేని వైనం అన్నట్టు విమర్శలు చేశారు.

కొందరు వైసీపీ నేతలు ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్, డీఈవోల దృష్టికి తీసుకెళ్లారు. సర్వీస్ రూల్స్ ను ఉల్లంఘించిన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు సిద్దమవుతున్నారు.

ఇలాంటి వారు ఇంకా ఉన్నారని… కాకపోతే వెంకటేశ్వరరావు నేరుగా కెమెరాకు చిక్కాడని… మిగిలిన వారు ముసుగులో టీడీపీకి పనిచేస్తున్నారని వైసీపీ వారు విమర్శిస్తున్నారు.

First Published:  21 Aug 2020 11:54 PM GMT
Next Story