Telugu Global
Cinema & Entertainment

చిరు-బాలయ్య మధ్యలో మోహన్ బాబు

లాక్ డౌన్ టైమ్ లో పరిశ్రమకు సంబంధించి చిరంజీవి నేతృత్వంలో కొంతమంది సినీపెద్దలు తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. దానిపై అప్పట్లో బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతా కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారంటూ కామెంట్ చేశారు. అప్పటి ఘటనపై తాజాగా మోహన్ బాబు రియాక్ట్ అయ్యారు. బాలకృష్ణ తన వ్యక్తిగత అభిప్రాయం చెప్పారని, దానిపై తను స్పందించనని అన్నారు. “బాలయ్య నాకు చాలా ఆప్తుడు. సోదరా అని పిలుస్తుంటాను. ఇద్దరం చాలా […]

చిరు-బాలయ్య మధ్యలో మోహన్ బాబు
X

లాక్ డౌన్ టైమ్ లో పరిశ్రమకు సంబంధించి చిరంజీవి నేతృత్వంలో కొంతమంది సినీపెద్దలు తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. దానిపై అప్పట్లో బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతా కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారంటూ కామెంట్ చేశారు. అప్పటి ఘటనపై తాజాగా మోహన్ బాబు రియాక్ట్ అయ్యారు. బాలకృష్ణ తన వ్యక్తిగత అభిప్రాయం చెప్పారని, దానిపై తను స్పందించనని అన్నారు.

“బాలయ్య నాకు చాలా ఆప్తుడు. సోదరా అని పిలుస్తుంటాను. ఇద్దరం చాలా ఆప్యాయంగా ఉంటాం. కలిసినప్పుడు సరదాగా మాట్లాడుకుంటాం. అంతే.. అంతకుమించి వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లం. ఎవరి పర్సనల్ విషయాలు వాళ్లవి. ఇండస్ట్రీలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని బాలయ్య అన్నాడంటున్నారు. దానిపై నేను స్పందించను. ఎవరి అభిప్రాయం వాళ్లది. అది ఆయన అభిప్రాయం. నా గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే నేను స్పందిస్తాను. ఇక చర్చల విషయానికొస్తే.. నన్ను కూడా అప్పుడు జరిగిన చర్చలకు పిలవలేదు. ఇంతకుమించి ఈ టాపిక్ పై వద్దు. వదిలేయండి.”

ఇలా అప్పటి చర్చలపై, బాలయ్య వ్యాఖ్యలపై నర్మగర్బంగా స్పందించారు మోహన్ బాబు. ఇండస్ట్రీ వ్యవహారాలకు సంబంధించి అన్నింటిలో తలదూర్చకూడదని నిర్ణయం తీసుకున్న మోహన్ బాబు.. చాలా విషయాలకు దూరంగా ఉంటున్నానని అన్నారు.

First Published:  25 Aug 2020 8:30 PM GMT
Next Story