అడ్డంగా బుక్ అయిన నూతన్ నాయుడు ఫ్యామిలీ... దాడి దృశ్యాలు రికార్డు
దళిత యువకుడికి గుండుకొట్టించిన వ్యవహారంలో కీలక ఆధారాలు బయటపడ్డాయి. నూతన్ నాయుడు భార్య మధుప్రియను ఈ కేసులో ఏ-1గా చేర్చారు. మొత్తం ఏడుగురిపై కేసు నమోదు అయింది. దళిత యువకుడిపై నూతన్నాయుడు కుటుంబ సభ్యులు కర్రలతో, రాడ్లతో కొడుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మీడియాకు విడుదల చేశారు. యువకుడికి గుండు కొడుతున్న దృశ్యాలను ఫోన్లలో కూడా రికార్డు చేశారు. ఇలా ఫోన్లలో రికార్డు చేస్తున్న దృశ్యాలు కూడా సీసీ […]
దళిత యువకుడికి గుండుకొట్టించిన వ్యవహారంలో కీలక ఆధారాలు బయటపడ్డాయి. నూతన్ నాయుడు భార్య మధుప్రియను ఈ కేసులో ఏ-1గా చేర్చారు. మొత్తం ఏడుగురిపై కేసు నమోదు అయింది.
దళిత యువకుడిపై నూతన్నాయుడు కుటుంబ సభ్యులు కర్రలతో, రాడ్లతో కొడుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మీడియాకు విడుదల చేశారు. యువకుడికి గుండు కొడుతున్న దృశ్యాలను ఫోన్లలో కూడా రికార్డు చేశారు. ఇలా ఫోన్లలో రికార్డు చేస్తున్న దృశ్యాలు కూడా సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
ఈ వ్యవహారంలో నిందితులు తప్పించుకునేందుకు అవకాశం లేని విధంగా ఆధారాలు లభించాయని పోలీసులు ప్రకటించారు. వివిధ సెక్షన్ల కింద పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేశారు. చెప్పకుండా పని మానేశాడన్న కోపంతో కర్రి శ్రీకాంత్ అనే యువకుడిపై నూతన్ నాయుడి భార్య దాడి చేసింది.
ఇంట్లో మొబైల్ ఫోన్ పోయిందని శ్రీకాంత్ను పిలిపించి నూతన్ నాయుడు కుటుంబ సభ్యులతో పాటు పలువురు దాడిచేసి కొట్టడమే కాకుండా గుండు కొట్టించారు. ఈ కేసులో A1గా ఉన్న నూతన్ నాయుడు భార్య మధుప్రియతో పాటు ఇంట్లో సహాయకులుగా ఉన్న వరహాలు, ఇందిర, ఝూన్సీ, సౌజన్య, బాలు, రవిపై పోలీసులు కేసు నమోదు చేశారు.