Telugu Global
CRIME

ప్రదీప్‌, కృష్ణుడుకు సంబంధం లేదు... 139 మంది రేప్‌ చేయలేదు, నన్ను క్షమించండి...

139 మంది తనపై అత్యాచారం చేశారంటూ పంజాగుట్ట పీఎస్‌లో యువతి ఇచ్చిన ఫిర్యాదు పెద్ద సంచలనమే సృష్టించింది. 139 మంది ఐదు వేల సార్లు తనపై అత్యాచారం చేశారంటూ యువతి ఇటీవల ఫిర్యాదు చేసింది. అందులో పలువురు సెలబ్రెటీల పేర్లను ఆమె వెల్లడించింది. యాంకర్ ప్రదీప్‌, నటుడు కృష్ణుడుతోపాటు టీఆర్‌ఎస్‌ ఎంపీ పీఏ కూడా తనపై దారుణానికి ఒడిగట్టారంటూ ఫిర్యాదు ఇచ్చింది. అయితే ఈ వ్యవహారం ఊహించని మలుపు తిరిగింది. ఆ అమ్మాయే మీడియా ముందుకు వచ్చి […]

ప్రదీప్‌, కృష్ణుడుకు సంబంధం లేదు... 139 మంది రేప్‌ చేయలేదు, నన్ను క్షమించండి...
X

139 మంది తనపై అత్యాచారం చేశారంటూ పంజాగుట్ట పీఎస్‌లో యువతి ఇచ్చిన ఫిర్యాదు పెద్ద సంచలనమే సృష్టించింది. 139 మంది ఐదు వేల సార్లు తనపై అత్యాచారం చేశారంటూ యువతి ఇటీవల ఫిర్యాదు చేసింది. అందులో పలువురు సెలబ్రెటీల పేర్లను ఆమె వెల్లడించింది.

యాంకర్ ప్రదీప్‌, నటుడు కృష్ణుడుతోపాటు టీఆర్‌ఎస్‌ ఎంపీ పీఏ కూడా తనపై దారుణానికి ఒడిగట్టారంటూ ఫిర్యాదు ఇచ్చింది. అయితే ఈ వ్యవహారం ఊహించని మలుపు తిరిగింది. ఆ అమ్మాయే మీడియా ముందుకు వచ్చి తాను చెప్పిన వివరాల్లో అవాస్తవాలు ఉన్నాయని వెల్లడించింది.

యాంకర్ ప్రదీప్‌, నటుడు కృష్ణుడు తనపై అత్యాచారం చేయలేదని వెల్లడించింది. వారికి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. డాలర్ బాయ్ ఒత్తిడి వల్లే తాను వారి పేర్లను చెప్పానని వివరించింది.

తనకు అన్యాయం జరిగిన మాట, కొందరు దాడి చేసిన మాట వాస్తవమేగానీ… కానీ 139 మంది అత్యాచారం చేశారన్నది మాత్రం అవాస్తవమని చెప్పింది. డాలర్ బాయ్ చెప్పడం వల్లే ప్రముఖుల పేర్లను తాను చెప్పానంది. చెప్పినట్టు చేయకపోతే తన కుటుంబాన్ని చంపేస్తానని డాలర్ బాయ్ బెదిరించాడని ఆమె వెల్లడించారు.

తన వల్ల ఇబ్బంది పడ్డ వారికి క్షమాపణ చెప్పారామె. తనపై అత్యాచారం చేసిన వారిపై మాత్రం పోరాడుతానని చెప్పారు. తన ఫొటోలను దయచేసి ఎవరూ చూపించవద్దని, తన పేరును వాడవద్దని మీడియాను కోరారు.

First Published:  31 Aug 2020 2:38 AM GMT
Next Story