తిరిగి వైసీపీ గూటికి చేరిన సునీల్
తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. కాకినాడ లోక్సభ నుంచి టీడీపీ తరపున మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన చలమలశెట్టి సునీల్ తిరిగి వైసీపీలో చేరారు. జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కండువా కప్పుకుని తిరిగి సొంత గూటికి చేరారు. వరుసగా మూడు సార్లు కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు. మూడు సార్లు మూడు వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేసి తక్కువ ఓట్లతో ఓడిపోయారు. మూడు సార్లూ రెండో స్థానంలో నిలిచారు. 2009లో పీఆర్పీ […]
తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. కాకినాడ లోక్సభ నుంచి టీడీపీ తరపున మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన చలమలశెట్టి సునీల్ తిరిగి వైసీపీలో చేరారు. జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కండువా కప్పుకుని తిరిగి సొంత గూటికి చేరారు.
వరుసగా మూడు సార్లు కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు. మూడు సార్లు మూడు వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేసి తక్కువ ఓట్లతో ఓడిపోయారు. మూడు సార్లూ రెండో స్థానంలో నిలిచారు. 2009లో పీఆర్పీ నుంచి, 2014లో వైసీపీ నుంచి, 2019లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
చలమలశెట్టి టీడీపీలో చేరడం… ఆఖరిలో పార్టీలో చేరిన వంగగీత వైసీపీ తరపున ఎంపీగా గెలిచేశారు. ఎన్నికల తర్వాత టీడీపీకి దూరంగా ఉంటున్న చలమలశెట్టి సునీల్ సోమవారం తిరిగి వైసీపీలో చేరారు.