Telugu Global
Cinema & Entertainment

మహేష్ బ్యానర్ లో మరో హీరో

మహేష్ కు ఆల్రెడీ సొంత బ్యానర్ ఉంది. చాన్నాళ్లుగా తన సినిమాలకు తానే సహ-నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు మహేష్. అయితే ఇప్పుడిప్పుడే తన బ్యానర్ పై బయట హీరోలతో కూడా సినిమాలు నిర్మించే కార్యక్రమం స్టార్ట్ చేశాడు. ఇందులో భాగంగా అడివి శేష్ హీరోగా మేజర్ సినిమాను స్టార్ట్ చేసిన మహేష్.. ఇప్పుడు నిర్మాతగా మరో హీరోకు ఛాన్స్ ఇచ్చాడు. ఈసారి మహేష్ బ్యానర్ పై నటించే అవకాశం నవీన్ పొలిశెట్టికి దక్కింది. ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ […]

మహేష్ బ్యానర్ లో మరో హీరో
X

మహేష్ కు ఆల్రెడీ సొంత బ్యానర్ ఉంది. చాన్నాళ్లుగా తన సినిమాలకు తానే సహ-నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు మహేష్. అయితే ఇప్పుడిప్పుడే తన బ్యానర్ పై బయట హీరోలతో కూడా సినిమాలు నిర్మించే కార్యక్రమం స్టార్ట్ చేశాడు. ఇందులో భాగంగా అడివి శేష్ హీరోగా మేజర్ సినిమాను స్టార్ట్ చేసిన మహేష్.. ఇప్పుడు నిర్మాతగా మరో హీరోకు ఛాన్స్ ఇచ్చాడు.

ఈసారి మహేష్ బ్యానర్ పై నటించే అవకాశం నవీన్ పొలిశెట్టికి దక్కింది. ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో లైమ్ లైట్లోకి వచ్చాడు నవీన్. ఈ మూవీ తర్వాత స్వప్న సినిమాస్ బ్యానర్ పై జాతిరత్నాలు అనే సినిమా చేశాడు. ఆ మూవీ టైమ్ లోనే మరో వినూత్నమైన కమర్షియల్ కథను రాసుకున్నాడు. ఇప్పుడా కథను మహేష్ బ్యానర్ పై తీయబోతున్నాడు. తను రాసుకున్న కథలో హీరోగా నటిస్తూ, దర్శకత్వ బాధ్యతల్ని మరో వ్యక్తికి అప్పగించబోతున్నాడు నవీన్.

ఫుల్ లెంగ్త్ ప్రొడక్షన్ లోకి దిగాలని మహేష్ ఆలోచన. ఇందులో భాగంగా అడివి శేష్, నవీన్ లాంటి హీరోలతో సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. త్వరలోనే వెబ్ సిరీస్ కూడా చేయబోతున్నాడని టాక్. ఈ నిర్మాణ వ్యవహారాలన్నింటినీ మహేష్ భార్య నమ్రత చూసుకుంటోంది.

First Published:  6 Sep 2020 10:00 PM GMT
Next Story