Telugu Global
National

బీజేపీ ఐటీ సెల్‌లో వెధవలున్నారు " ఎంపీ సుబ్రమణ్యస్వామి

సొంత పార్టీ ఐటీ సెల్‌పై బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఐటీ సెల్‌లో వెధవలున్నారని విమర్శించారు. బీజేపీ ఐటీ సెల్‌ హెడ్‌ అమిత్ మాల్వియా తనపై నకిలీ అకౌంట్ల ద్వారా దాడి చేయిస్తున్నారని సుబ్రమణ్యస్వామి ఆరోపించారు. బీజేపీ ఐటీ సెల్‌ రోగ్‌ అయిపోయిందని మండిపడ్డారు. ఐటీ సెల్ వెధవలు చేసే పనికి బీజేపీ ఏవిధంగా బాధ్యత వహించడం లేదో… తనపై దూషణలను చేసే వారిపై తన అభిమానులు చేసే దాడికి కూడా తాను […]

బీజేపీ ఐటీ సెల్‌లో వెధవలున్నారు  ఎంపీ సుబ్రమణ్యస్వామి
X

సొంత పార్టీ ఐటీ సెల్‌పై బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఐటీ సెల్‌లో వెధవలున్నారని విమర్శించారు. బీజేపీ ఐటీ సెల్‌ హెడ్‌ అమిత్ మాల్వియా తనపై నకిలీ అకౌంట్ల ద్వారా దాడి చేయిస్తున్నారని సుబ్రమణ్యస్వామి ఆరోపించారు.

బీజేపీ ఐటీ సెల్‌ రోగ్‌ అయిపోయిందని మండిపడ్డారు. ఐటీ సెల్ వెధవలు చేసే పనికి బీజేపీ ఏవిధంగా బాధ్యత వహించడం లేదో… తనపై దూషణలను చేసే వారిపై తన అభిమానులు చేసే దాడికి కూడా తాను అలాగే బాధ్యత వహించను అని స్వామి వ్యాఖ్యానించారు. సొంత పార్టీ ఎంపీపై తప్పుడు ప్రచారం చేయిస్తున్న వారిపై పార్టీ తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

బీజేపీ మర్యాదరామన్నలదే గానీ… రావణాసులదికాదు, దుశ్శాసనులది కాదు కదా అని స్వామి ప్రశ్నించారు. గత కొన్ని రోజులుగా సుబ్రమణ్యస్వామి జేఈఈ-నీట్ పరీక్షలపై కూడా బీజేపీ వైఖరితో విభేదించారు. పరీక్షలపై మోడీ ఆలోచననూ ఆయన తప్పుపట్టారు. చైనా దురాక్రమణ పట్ల ప్రభుత్వ వైఖరిని కూడా విమర్శించారు.

అప్పటి నుంచి కొందరు స్వామిపై సోషల్ మీడియాలో దాడి మొదలుపెట్టారు. ఇది బీజేపీ ఐటీ సెల్‌ చేసినట్టు స్వామి ఆరోపిస్తున్నారు.

First Published:  7 Sep 2020 8:40 PM GMT
Next Story