కొత్త సినిమా ప్రకటించిన అఖిల్
ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమా చేస్తున్నాడు అఖిల్. ఈ మూవీ సెట్స్ పై ఉంటుండగానే మరో సినిమా ప్రకటించాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ తన కొత్త సినిమా ప్రకటించాడు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అనీల్ సుంకర నిర్మాతగా ఈ సినిమా రాబోతోంది. అనీల్ సుంకరకు 9-నంబర్ సెంటిమెంట్ అందుకే 9వ నెల 9వ తేదీన ఉదయం 9 గంటల 9 నిమిషాలకు ఈ సినిమాను ప్రకటించాడు. అన్నీ అనుకున్నట్టు […]
ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమా చేస్తున్నాడు అఖిల్. ఈ మూవీ సెట్స్ పై ఉంటుండగానే మరో సినిమా ప్రకటించాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ తన కొత్త సినిమా ప్రకటించాడు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అనీల్ సుంకర నిర్మాతగా ఈ సినిమా రాబోతోంది.
అనీల్ సుంకరకు 9-నంబర్ సెంటిమెంట్ అందుకే 9వ నెల 9వ తేదీన ఉదయం 9 గంటల 9 నిమిషాలకు ఈ సినిమాను ప్రకటించాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.
అఖిల్-సురేందర్ రెడ్డి సినిమాకు వక్కంతం వంశీ కథ అందిస్తున్నాడు. ఇంతకుముందు వక్కంతం-సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో కిక్, రేసుగుర్రం లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ వచ్చాయి. సో.. ఈ కాంబినేషన్ మరోసారి క్లిక్ అవుతుందని అఖిల్ ఆశపడుతున్నాడు.
It’s time ! Announcing my next with @DirSurender and @AnilSunkara1. This one is extremely special to me ??. Fully pumped to start soon. Energy all the way ?? @AKentsOfficial @S2C_Offl #Akhil5 pic.twitter.com/fCF25tR3qJ
— Akhil Akkineni (@AkhilAkkineni8) September 9, 2020