Telugu Global
National

టీవీ నటి శ్రావణి ఆత్మహత్య

బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య చేసుకున్నారు. మౌనరాగం, మనసు మమత లాంటి సీరియల్స్‌లో ఈమె నటిస్తున్నారు. హైదరాబాద్ మధురానగర్‌లోని తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారామె. టిక్‌టాక్‌ ద్వారా పరిచయం అయిన కాకినాడ గొల్లప్రోలుకు చెందిన దేవరాజ్‌ అనే వ్యక్తి వేధింపుల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. 8నెలల క్రితం దేవరాజ్‌తో శ్రావణికి పరిచయం ఏర్పడింది. అతడు కూడా సీరియల్స్ లో‌ నటించాలకున్నాడు. ఇందుకోసం శ్రావణి సాయం తీసుకున్నాడు. హైదరాబాద్‌ వచ్చి కొద్దిరోజుల […]

టీవీ నటి శ్రావణి ఆత్మహత్య
X

బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య చేసుకున్నారు. మౌనరాగం, మనసు మమత లాంటి సీరియల్స్‌లో ఈమె నటిస్తున్నారు. హైదరాబాద్ మధురానగర్‌లోని తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారామె. టిక్‌టాక్‌ ద్వారా పరిచయం అయిన కాకినాడ గొల్లప్రోలుకు చెందిన దేవరాజ్‌ అనే వ్యక్తి వేధింపుల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

8నెలల క్రితం దేవరాజ్‌తో శ్రావణికి పరిచయం ఏర్పడింది. అతడు కూడా సీరియల్స్ లో‌ నటించాలకున్నాడు. ఇందుకోసం శ్రావణి సాయం తీసుకున్నాడు. హైదరాబాద్‌ వచ్చి కొద్దిరోజుల పాటు వారి ఇంట్లోనే ఉన్నట్టు చెబుతున్నారు. ఆ తర్వాత దేవరాజ్‌ శ్రావణిని వేధించడం మొదలుపెట్టాడని ఆమె కుటుంబసభ్యులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకుందని ఆమె సోదరుడు చెప్పారు. బాత్‌రూంలో ఆమె ఉరేసుకున్నారు.

కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

First Published:  8 Sep 2020 8:29 PM GMT
Next Story