పార్టీ ఆఫీస్కు తాళం వేసి హైదరాబాద్లో ఉంటే.... " అయ్యన్న అసంతృప్తి
తెలుగుదేశం పార్టీ నాయకత్వంపైన అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న చింతకాయల అయ్యన్నపాత్రుడు … పార్టీ అధ్యక్షుడు హైదరాబాద్లో ఉండిపోవడం, అప్పుడప్పుడు చుట్టపు చూపుగా ఏపీకి వచ్చి వెళ్లడం సరికాదని నేరుగా చంద్రబాబుకే చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. ప్రజల్లోకి వెళ్లకుండా కేవలం ఆన్లైన్ సమావేశాలు, మీడియా హడావుడితో సరిపెడితే పార్టీకి భవిష్యత్తు ఉండదని అయ్యన్నపాత్రుడు హెచ్చరించారు. కొందరు ప్రచారం కోసం పనిచేస్తున్నట్టు హడావుడి చేస్తున్నారని… వారి వల్ల కూడా […]
తెలుగుదేశం పార్టీ నాయకత్వంపైన అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న చింతకాయల అయ్యన్నపాత్రుడు … పార్టీ అధ్యక్షుడు హైదరాబాద్లో ఉండిపోవడం, అప్పుడప్పుడు చుట్టపు చూపుగా ఏపీకి వచ్చి వెళ్లడం సరికాదని నేరుగా చంద్రబాబుకే చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. ప్రజల్లోకి వెళ్లకుండా కేవలం ఆన్లైన్ సమావేశాలు, మీడియా హడావుడితో సరిపెడితే పార్టీకి భవిష్యత్తు ఉండదని అయ్యన్నపాత్రుడు హెచ్చరించారు.
కొందరు ప్రచారం కోసం పనిచేస్తున్నట్టు హడావుడి చేస్తున్నారని… వారి వల్ల కూడా ఉపయోగం ఉండదని వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర పార్టీ కార్యాలయానికి తాళం వేసి అధ్యక్షుడు నెలల తరబడి హైదరాబాద్లో గడిపితే ప్రజలు ఏమనుకుంటారో ఆలోచించుకోవాలని సలహా ఇచ్చారు. ఇలాగైతే పార్టీని రక్షించడం కష్టమవుతుందని చంద్రబాబుకే తేల్చిచెప్పారు.
అయ్యన్నపాత్రుడు ఈస్థాయిలో రియాక్ట్ అవడంతో చంద్రబాబు ఏపీకి వెళ్లాల్సిందిగా కుమారుడు నారా లోకేష్ను ఆదేశించారని చెబుతున్నారు.