Telugu Global
Cinema & Entertainment

హీరో ఆర్యకు కోర్టు నోటీసులు

మొన్నటికిమొన్న కోర్టు నుంచి హీరో సూర్యకు అక్షింతలు పడ్డాయి. కోర్టు ధిక్కరణ వ్యాఖ్యలు చేసినప్పటికీ, తొలి తప్పుగా సూర్యను క్షమించి వదిలేసింది కోర్టు. ఇప్పుడు మరో నటుడు ఆర్య, కోర్టు కేసు ఎదుర్కొంటున్నాడు. పైగా ఇది 9 ఏళ్ల కిందటి సినిమాకు సంబంధించిన కేసు కావడం ఇక్కడ విశేషం. 2011లో అవన్-ఇవన్ అనే సినిమా చేశాడు ఆర్య. నిజానికి ఇందులో ఆర్య మెయిన్ హీరో కాదు. విశాల్ ఇందులో హీరో, ఆర్య సెకెండ్ హీరో. తెలుగులో ఇదే […]

హీరో ఆర్యకు కోర్టు నోటీసులు
X

మొన్నటికిమొన్న కోర్టు నుంచి హీరో సూర్యకు అక్షింతలు పడ్డాయి. కోర్టు ధిక్కరణ వ్యాఖ్యలు చేసినప్పటికీ, తొలి తప్పుగా సూర్యను క్షమించి వదిలేసింది కోర్టు. ఇప్పుడు మరో నటుడు ఆర్య, కోర్టు కేసు ఎదుర్కొంటున్నాడు. పైగా ఇది 9 ఏళ్ల కిందటి సినిమాకు సంబంధించిన కేసు కావడం ఇక్కడ విశేషం.

2011లో అవన్-ఇవన్ అనే సినిమా చేశాడు ఆర్య. నిజానికి ఇందులో ఆర్య మెయిన్ హీరో కాదు. విశాల్ ఇందులో హీరో, ఆర్య సెకెండ్ హీరో. తెలుగులో ఇదే సినిమా వాడు-వీడు పేరిట రిలీజైంది కూడా. ఇప్పుడీ సినిమా వల్ల కోర్టు నుంచి నోటీసులు అందుకున్నాడు ఆర్య.

బాల డైరక్ట్ చేసిన ఈ సినిమాలో ఒకప్పటి పాలకులైన సింగంపట్టి జమీందార్లను కించపరిచేలా ఆర్య వ్యాఖ్యలు చేశాడట. 1700 సంవత్సరంలో అంబసముద్రం కేంద్రంగా సింగంపట్టి రాజులు ఆ ప్రాంతాన్ని పాలించారు. వాళ్లపై సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు, డైలాగ్స్ ఉన్నాయంటూ అంబసముద్రం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈనెల 28న కోర్టుకు హాజరుకావాల్సిందిగా ఆర్యకు నోటీసులు జారీచేసింది స్థానిక కోర్టు.

ప్రస్తుతం కోలీవుడ్ లో లీడింగ్ యాక్టర్ గా రాణిస్తున్నాడు ఆర్య. తమిళ-మలయాళ సినిమాలతో బిజీగా ఉన్నాడు. రీసెంట్ గా సూర్య నటించిన బందోబస్త్ సినిమాలో కీలక పాత్ర పోషించాడు.

First Published:  19 Sep 2020 11:48 PM GMT
Next Story