Telugu Global
National

ప్రైవేట్ స్కూళ్ల తనిఖీ కమిటీపై ఏపీ హైకోర్ట్ స్టే..

ప్రైవేట్ స్కూళ్లలో వసతులు, సౌకర్యాలు తనిఖీ చేసి, తద్వారా ఫీజులు నిర్ణయించేందుకు ఏపీ ప్రభుత్వం గతంలో ఏర్పాటు చేసిన కమిషన్ కార్యకలాపాలపై హైకోర్టు తాత్కాలిక స్టే విధించింది. ఏపీ పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ పేరుతో రెడ్డి కాంతారావు చైర్మన్ గా దీన్ని ఏర్పాటు చేసింది వైసీపీ ప్రభుత్వం. లాక్ డౌన్ లేకపోయి ఉంటే.. ఈ పాటికే ఈ కమిషన్ తన కార్యకలాపాలు ప్రారంభించాల్సి ఉంది. అయితే కాస్త ఆలస్యంగా.. కమిషన్ తన పనులు మొదలు […]

ప్రైవేట్ స్కూళ్ల తనిఖీ కమిటీపై ఏపీ హైకోర్ట్ స్టే..
X

ప్రైవేట్ స్కూళ్లలో వసతులు, సౌకర్యాలు తనిఖీ చేసి, తద్వారా ఫీజులు నిర్ణయించేందుకు ఏపీ ప్రభుత్వం గతంలో ఏర్పాటు చేసిన కమిషన్ కార్యకలాపాలపై హైకోర్టు తాత్కాలిక స్టే విధించింది.

ఏపీ పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ పేరుతో రెడ్డి కాంతారావు చైర్మన్ గా దీన్ని ఏర్పాటు చేసింది వైసీపీ ప్రభుత్వం. లాక్ డౌన్ లేకపోయి ఉంటే.. ఈ పాటికే ఈ కమిషన్ తన కార్యకలాపాలు ప్రారంభించాల్సి ఉంది. అయితే కాస్త ఆలస్యంగా.. కమిషన్ తన పనులు మొదలు పెట్టింది. ప్రైవేట్ స్కూళ్లలో వసతులు, సౌకర్యాలు తనిఖీ చేసేందుకు నడుం కట్టింది.

ఈ నేపథ్యంలో ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు ఈ కమిషన్ కి అడ్డు తగిలాయి. తమకు అన్యాయం జరుగుతోందంటూ కోర్టుకెక్కాయి. ప్రైవేట్ స్కూల్స్ ఫీజుల్ని ప్రభుత్వం ఎలా నిర్థారిస్తుందని ప్రశ్నించాయి, ఒకవేళ అలా నిర్థారిస్తే… ప్రైవేట్ స్కూల్స్ ఫీజులపై నియంత్రణ విధిస్తే.. నాణ్యతా ప్రమాణాలు పడిపోతాయని వాదించాయి.

దీనిపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. తాత్కాలికంగా కమిషన్ పై స్టే విధించింది. దీంతో ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలకు ఊరట కలిగినట్లయింది. ఈ కమిషన్ కార్యకలాపాలు పూర్తిస్థాయిలో అమలులోకి వస్తే.. ప్రైవేట్ స్కూల్స్ ఫీజు దోపిడీకి ముకుతాడు పడే అవకాశం ఉంది.

ఫీజులతోపాటు, వాటి కార్యకలాపాలు, పరీక్షల నిర్వహణ, ఉపాధ్యాయుల నియామకాల నిబంధనలు.. అన్నీ ఈ కమిషన్ పరిధిలోకి వస్తాయి. కమిషన్ ప్రతి స్కూల్ ని విడివిడిగా సందర్శించి.. అక్కడ ఉన్న సౌకర్యాలను మదింపు చేసి ఫీజు నిర్ణయిస్తింది. ఈ ఫీజుని కూడా విడతలవారీగా చెల్లించుకునే వెసులుబాటుని తల్లిదండ్రులకు కల్పిస్తుంది. ప్రైవేట్ స్కూల్స్ ఖాతా లెక్కలన్నీ ఈ కమిషన్ కి నివేదించాల్సి ఉంటుంది. ప్రభుత్వ సిలబస్ ని కచ్చితంగా అమలు చేసేలా చూస్తుంది.

ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాధికారాలన్నీ కమిషన్ కి కట్టబెడుతూ గతంలో జీవో విడుదల చేసింది. అయితే హైకోర్టు స్టేతో.. తాత్కాలికంగా ఈ సంస్కరణలకు బ్రేక్ పడింది. విచిత్రం ఏంటంటే.. గతంలో తెలంగాణ హైకోర్టు.. ప్రైవేట్ స్కూల్స్ ఫీజుల దోపిడీపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరుపుతూ.. అక్కడి ప్రభుత్వానికి చీవాట్లు పెట్టింది. ఇష్టానుసారంగా ఫీజులు పెంచుతున్న ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలపై చర్యలు ఎందుకు తీసుకోవడంలేదని ప్రశ్నించింది. తానే స్వయంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కి నోటీసులు కూడా జారీ చేసింది. ఏపీలో మాత్రం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఏపీ హైకోర్టు స్టే విధించడం గమనార్హం.

First Published:  11 Oct 2020 8:38 PM GMT
Next Story