Telugu Global
CRIME

చెల్లిని హత్య చేసి... పక్కనే కూర్చుని...!

తనకు నచ్చని వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని మొండికేసిందని… తోడబుట్టిన చెల్లిని హత్యచేశాడు ఓ యువకుడు. రాజస్థాన్ లోని అల్వార్ జిల్లాలో ఈ ఘోరం జరిగింది. వివరాల్లోకి వెళితే…భివాడీ టౌన్ కి సమీపంలోని శంతల్కా గ్రామానికి చెందిన పవన్ (24) ఎసి రిపేర్ షాపు నడుపుతున్నాడు. అతనివద్ద విష్ణు అనే యువకుడు పనిచేస్తున్నాడు. పవన్ చెల్లెలు (22), విష్ణు పరస్పరం ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. ఇరువురిదీ ఒకే కులం అయినప్పటికీ పవన్ కుటుంబంలో ఎవరూ అందుకు ఒప్పుకోలేదు. […]

చెల్లిని హత్య చేసి... పక్కనే కూర్చుని...!
X

తనకు నచ్చని వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని మొండికేసిందని… తోడబుట్టిన చెల్లిని హత్యచేశాడు ఓ యువకుడు. రాజస్థాన్ లోని అల్వార్ జిల్లాలో ఈ ఘోరం జరిగింది.

వివరాల్లోకి వెళితే…భివాడీ టౌన్ కి సమీపంలోని శంతల్కా గ్రామానికి చెందిన పవన్ (24) ఎసి రిపేర్ షాపు నడుపుతున్నాడు. అతనివద్ద విష్ణు అనే యువకుడు పనిచేస్తున్నాడు. పవన్ చెల్లెలు (22), విష్ణు పరస్పరం ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. ఇరువురిదీ ఒకే కులం అయినప్పటికీ పవన్ కుటుంబంలో ఎవరూ అందుకు ఒప్పుకోలేదు.

అయితే పవన్ సోదరి మాత్రం తను విష్ణుని తప్ప ఇంకెవరినీ చేసుకోనని మొండికేసింది. ఈ క్రమంలో కొన్నాళ్లుగా ఇంట్లో గొడవలు అవుతున్నాయి. పవన్ తల్లిదండ్రులు కూతురికోసం వేరే సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. విష్ణు జాబ్ వదిలేసి వెళ్లిపోయాడు.

ఇదిలా ఉండగా అన్నాచెల్లెళ్ల మధ్య అదే గొడవ జరిగిందో, ఇంకేమైందో తెలియదు కానీ… తెల్లవారితే శుక్రవారం అనగా… అర్థరాత్రి పవన్ తన చెల్లిని హత్యచేశాడు. ఆ సమయంలో తల్లిదండ్రులు ఇంట్లో లేరు. వాళ్లు అంతకుముందు వేరే ఊరు వెళ్లారు. పవన్ హతురాలి పక్కనే కూర్చుని తల్లిదండ్రులకు కాల్ చేసి చెల్లిని చంపేశానని చెప్పాడు. వాళ్లు అతను చెబుతున్నది నమ్మలేదు. ఊరికే అలా అంటున్నాడని అనుకున్నారు.

శుక్రవారం మధ్యాహ్నం పాలుపోసే వ్యక్తి ద్వారా సమాచారం బయటకు వెళ్లటంతో పోలీసులు వచ్చారు. అప్పటివరకు పవన్ అలాగే చెల్లెలి శవం పక్కనే కూర్చుని ఉన్నాడు. అతను ఆమె తలని నేలకు బలంగా కొట్టి చంపేసి ఉంటాడని పోలీసులు చెబుతున్నారు…. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

First Published:  24 Oct 2020 9:20 AM GMT
Next Story