Telugu Global
National

పెళ్లికి నో చెప్పిందని... టీవీ నటిపై దాడి !

ముంబయిలోని అంథేరి ప్రాంతంలో మాల్వి మల్హోత్రా అనే టీవీ నటి కత్తిపోట్లకు గురయ్యింది. ఆమెకు  తెలిసిన వ్యక్తి… పెళ్లి చేసుకోమని వెంటబడి వేధిస్తున్న యోగేష్ మహిపాల్ సింగ్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. సోమవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో ముంబయి, అంథేరిలోని వెర్సోవా అనే ప్రాంతంలో కేఫ్ నుండి బయటకు వచ్చి ఇంటికి వెళుతుండగా మాల్విపై ఈ దాడి జరిగింది. నడుస్తున్న మాల్విని కారులో వచ్చిన మహిపాల్ ఆపాడు. తనతో ఎందుకు మాట్లాడటం లేదని అడిగాడు. మాల్వి […]

పెళ్లికి నో చెప్పిందని... టీవీ నటిపై దాడి !
X

ముంబయిలోని అంథేరి ప్రాంతంలో మాల్వి మల్హోత్రా అనే టీవీ నటి కత్తిపోట్లకు గురయ్యింది. ఆమెకు తెలిసిన వ్యక్తి… పెళ్లి చేసుకోమని వెంటబడి వేధిస్తున్న యోగేష్ మహిపాల్ సింగ్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. సోమవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో ముంబయి, అంథేరిలోని వెర్సోవా అనే ప్రాంతంలో కేఫ్ నుండి బయటకు వచ్చి ఇంటికి వెళుతుండగా మాల్విపై ఈ దాడి జరిగింది.

నడుస్తున్న మాల్విని కారులో వచ్చిన మహిపాల్ ఆపాడు. తనతో ఎందుకు మాట్లాడటం లేదని అడిగాడు. మాల్వి సమాధానం చెప్పటంతో ఇద్దరికీ మాటా మాటా పెరిగింది. వాదిస్తూనే మహిపాల్ కత్తితో ఆమె పొట్టలో, చేతులపై పొడిచి కారులోనే పారిపోయాడు.

గత సంవత్సరం ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన మహిపాల్… తరువాత తాను నిర్మాతని అని చెప్పుకుని మాల్విని తరచుగా కలుస్తుండేవాడు. ఆ తరువాత పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేశాడు. అతని ప్రవర్తన నచ్చకపోవటంతో మాల్వి ఫేస్ బుక్ లో అతని ఖాతాని బ్లాక్ చేసింది. అతనితో పూర్తిగా మాట్లాడటం మానేసింది. దాంతో కక్షపెంచుకున్న మహిపాల్ ఇంతకి తెగించాడు. మాల్వి చెప్పిన వివరాలను బట్టి పోలీసులు వెల్లడించిన విషయాలివి.

మాల్వి ప్రస్తుతం ఓ ప్రయివేటు హాస్పటల్ లో చికిత్స పొందుతున్నదని, ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నదని, మహిపాల్ పై హత్యా ప్రయత్నంతో పాటు పలు కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని వెర్సోవా పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్ స్పెక్టర్ చెప్పారు.

First Published:  27 Oct 2020 9:00 AM GMT
Next Story