Telugu Global
Cinema & Entertainment

ఇండియాకొచ్చిన రాధేశ్యామ్

ఓవైపు కరోనా సెకెండ్ వేవ్ ప్రారంభమైనప్పటికీ ఇటలీలో ధైర్యంగా షూటింగ్ చేశాడు ప్రభాస్. అలా రాధేశ్యామ్ సినిమాకు సంబంధించి కీలకమైన షెడ్యూల్ పూర్తిచేసిన ఈ హీరో, ఎట్టకేలకు ఇండియాలో ల్యాండ్ అయ్యాడు. అయితే ఈసారి ప్రభాస్ హైదరాబాద్ రాలేదు. ముంబయిలో దిగాడు. దీనికి ఓ కారణం ఉంది. రాధేశ్యామ్ కంప్లీట్ అయిన వెంటనే ఆదిపురుష్ సినిమా స్టార్ట్ చేయాలి ప్రభాస్. ఆ మూవీకి సంబంధించి ఇప్పటికే ప్రీప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయింది. ఆ పనుల్ని పరిశీలించేందుకు, దర్శకుడి […]

ఇండియాకొచ్చిన రాధేశ్యామ్
X

ఓవైపు కరోనా సెకెండ్ వేవ్ ప్రారంభమైనప్పటికీ ఇటలీలో ధైర్యంగా షూటింగ్ చేశాడు ప్రభాస్. అలా రాధేశ్యామ్ సినిమాకు సంబంధించి కీలకమైన షెడ్యూల్ పూర్తిచేసిన ఈ హీరో, ఎట్టకేలకు ఇండియాలో ల్యాండ్ అయ్యాడు. అయితే ఈసారి ప్రభాస్ హైదరాబాద్ రాలేదు. ముంబయిలో దిగాడు. దీనికి ఓ కారణం ఉంది.

రాధేశ్యామ్ కంప్లీట్ అయిన వెంటనే ఆదిపురుష్ సినిమా స్టార్ట్ చేయాలి ప్రభాస్. ఆ మూవీకి సంబంధించి ఇప్పటికే ప్రీప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయింది. ఆ పనుల్ని పరిశీలించేందుకు, దర్శకుడి ఓం రౌత్ తో మరోసారి ఫైనల్ గా చర్చలు జరిపేందుకు ముంబయిలో ల్యాండ్ అయ్యాడు.

అన్నీ అనుకున్నట్టు జరిగితే జనవరి నుంచి ఆదిపురుష్ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకురావాలని భావిస్తున్నాడు ప్రభాస్. జనవరి నుంచి మార్చి వరకు ఏకథాటిగా షూటింగ్ చేసి, సినిమాకు సంబంధించిన సీజీ షాట్స్ అన్నీ పూర్తిచేయబోతున్నారు.

సీజీ షాట్స్ పూర్తయితే.. గ్రాఫిక్స్ వర్క్ మొదలవుతుంది. ఆ వర్క్ పూర్తయితే సినిమా దాదాపు 80శాతం పూర్తయినట్టే. ఇలా పక్కా ప్లానింగ్ తో షెడ్యూల్స్ ఫిక్స్ చేశాడు ప్రభాస్.

First Published:  7 Nov 2020 8:46 AM GMT
Next Story