దుబ్బాక రిపీట్ అంటే కుప్పం బై ఎలక్షన్ రావడమే !
దుబ్బాకలో బీజేపీ గెలుపుతో ఏపీలో కూడా ఉప ఎన్నికల ముచ్చట నడుస్తోంది. ఏపీలో కూడా ఉప ఎన్నిక జరిగితే దుబ్బాక రిజల్టే రిపీట్ అవుతుందని టీడీపీ కార్యకర్తలు కొందరు సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు. వైసీపీకి జనం షాక్ ఇవ్వడం ఖాయమని కామెంట్లు చేస్తున్నారు. టీడీపీ కామెంట్స్పై ప్రెస్మీట్లో మంత్రి కొడాలి నాని సెటైర్ వేశారు. ఏపీలో దుబ్బాక ఫలితాలు రిపీట్ కావడం అంటే కుప్పంకు బై ఎలక్షన్ రావడమే అన్నారు. దుబ్బాక టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట […]
దుబ్బాకలో బీజేపీ గెలుపుతో ఏపీలో కూడా ఉప ఎన్నికల ముచ్చట నడుస్తోంది. ఏపీలో కూడా ఉప ఎన్నిక జరిగితే దుబ్బాక రిజల్టే రిపీట్ అవుతుందని టీడీపీ కార్యకర్తలు కొందరు సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు. వైసీపీకి జనం షాక్ ఇవ్వడం ఖాయమని కామెంట్లు చేస్తున్నారు.
టీడీపీ కామెంట్స్పై ప్రెస్మీట్లో మంత్రి కొడాలి నాని సెటైర్ వేశారు. ఏపీలో దుబ్బాక ఫలితాలు రిపీట్ కావడం అంటే కుప్పంకు బై ఎలక్షన్ రావడమే అన్నారు. దుబ్బాక టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో మృతిచెందారు. అందువల్లే ఉప ఎన్నిక వచ్చిందని… కుప్పం ఎమ్మెల్యేకు కూడా అనారోగ్య సమస్యలు ఉన్నాయని… వాటి గురించి తాను మాట్లాడబోనని చెప్పారు.
తిరుపతి ఎంపీ దుర్గాప్రసాదరావు కరోనాతో ఇటీవల మృతిచెందారు. ఆరు నెలలలోపు తిరుపతి ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే ఉప ఎన్నిక ఇప్పట్లో జరిగే అవకాశం లేదు. 2021 మార్చి నాటికి ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది.
అయితే తిరుపతి ఉప ఎన్నిక గురించి మాత్రం టీడీపీ మాట్లాడడం లేదు. అక్కడ తాము పోటీ చేయబోమని ఇప్పటికే ఒకవైపు లీకులు ఇస్తోంది. బీజేపీ అభ్యర్థిని నిలబెడితే మద్దతు ఇస్తామని అంటోంది.
మరోవైపు తమ అభ్యర్థిగా పనబాక లక్ష్మి బరిలో ఉంటారని మరో లీకు ఇస్తోంది. అయితే పనబాకను బీజేపీలోకి పంపి… ఆ పార్టీ తరపున అభ్యర్థిగా నిలబెట్టాలని టీడీపీ ప్లాన్లు వేస్తోంది. ఎన్నికల సీజన్ వచ్చేవరకూ టీడీపీ ఇంకా ఎన్ని యూ టర్న్లు తీసుకుంటుందో చూడాలి.